Advertisement

Advertisement


Home > Articles - Special Articles

గ్రామం దత్తత.. రియల్ లైఫ్ ‘శ్రీమంతుడు’

గ్రామం దత్తత.. రియల్ లైఫ్ ‘శ్రీమంతుడు’

ఊరిని దత్తత తీసుకోవడం అంటే.. మూడేళ్ల నుంచి ఇదో ప్రచార ఆర్భాటం. ఈ మధ్యకాలంలో ఇలాంటి హడావుడి చేస్తున్న వాళ్లు చాలా మందే ఉంటున్నారు. పేరుకు దత్తత తీసుకున్నామని ప్రకటన చేసేసి ప్రచారం పొందుతున్న వాళ్లు కొందరైతే.. ప్రభుత్వం సొమ్మును వాడేస్తూ సెల్ఫ్ పబ్లిసిటీ పొందుతున్న వాళ్లు మరికొందరు.

కొందరు దత్తత ప్రకటన చేశాకా.. ఏడాది తరువాత వెళ్లి చూస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అన్న విధంగా ఆ గ్రామం ఉంటుంది. వాళ్లకు కావాల్సిన పబ్లిసిటీ వాళ్లకు వచ్చేస్తుంది. అలా కాకుండా పబ్లిసిటీకి దూరంగా పుట్టిన ఊరికోసం ఎంతో సేవ చేసే వాళ్లు చాలా కొద్ది మంది ఉన్నారు. అలాంటి వాళ్లల్లో మేఘా సంస్థ యజమానులు పీపీ రెడ్డి, పీ.వీ కృష్ణా రెడ్డి ముఖ్యులు.

మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ అధినేతలు కన్నతల్లిని, సొంత ఊరిని మరవ కూడదనే నానుడిని నిజం చేస్తూ తమ స్వగ్రామం కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండం డోకిపర్రు ప్రజలకు అనేక వసతులు కల్పిస్తున్నారు. సురక్షిత తాగునీటిని అందించాలనే లక్ష్యంతో నాలుగు కోట్ల రూపాయల ఖర్చుతోమంచినీటి ట్యాంకును ఏర్పాటు చేశారు. దీనితో పాటు 1500ఇళ్లకు మంచినీటి కుళాయిలను ఈ నెల 14న ప్రారంభించనున్నారు.

డోకిపర్రు గ్రామంలో ప్రస్తుతం గ్రామ పంచాయితీ ఏర్పాటు చేసిన పబ్లిక్ నల్లాలు, పంచాయితీ ఇంటింటికి మంజూరు చేసిన కనెక్షన్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. గ్రామ పంచాయితీకి నగదు చెల్లించిన వారికే ఈ కనెక్షన్లు ఇచ్చేవారు. ఇప్పటికే ఎంఈఐఎల్ డోకిపర్రు గ్రామాన్ని దత్తత తీసుకుని పలు అభివృద్ధి కార్యకమ్రాలను చేపట్టింది. ఈ సంస్థ సురక్షిత మంచినీటిని అందించాలని నిర్ణయించింది.

అందులో భాగంగా గ్రామం మొత్తానికి మంచి నీటి పైప్‌ లైన్, ఓవర్ హెడ్ ట్యాంక్ ఏర్పాటు చేశారు. గ్రామం అంతటికీ సురక్షిత మంచినీటిని సరఫరా చేసేందుకు వీలుగా రెండు లక్షల లీటర్ల సామర్ధ్యం ఉన్న మంచినీటి ట్యాంక్‌ను నిర్మించారు. గతంలో గ్రామ పంచాయితీ నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంక్‌కు అవసరమైన మరమ్మత్తులు చేశారు. పామిరెడ్డి కృష్ణారెడ్డి, భద్రమ్మ జ్ఞాపకార్ధం ఎంఈఐఎల్ సంస్థ ప్రతి ఇంటికి నీటి కుళాయి, ఉచిత సురక్షితమంచినీటి పథకంలో భాగంగా ప్రత్యేక ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా ఇక నుంచి మంచి నీటిని మేఘా ఇంజనీరింగ్ సంస్థ అందించనున్నది.

ఓవర్ హెడ్ ట్యాంక్, మంచినీటి పైప్‌ లైన్లు, కుళాయిలను ఈ నెల 14న ఎంఈఐఎల్ చైర్మన్ పీపీ రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ పీ.వీ కృష్ణారెడ్డిలు ప్రారంభించనున్నారు. గ్రామంలో ఇప్పటికే వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మించారు. దేవాలయానికి అనుబంధంగా నిర్మించిన కల్యాణమండపాన్ని స్థానికులు పెళ్లిళ్లు నిర్వహించుకునేందుకు ఉచితంగా అందిస్తున్నారు. దేవాలయంలో రోజూ అన్నదాన కార్యక్రమం కూడా కొనసాగుతోంది.

స్థానికంగా ఉన్న ఎస్టీ కాలనీ ప్రజల ఇబ్బందులను తొలిగించేందుకు మేఘా సంస్థ రూ. 50లక్షల ఖర్చుతో సిఎస్ఆర్ పథకం కింద బ్రిడ్జీని నిర్మిస్తున్నారు. ఇప్పటికే గ్రామంలోని అన్ని వీధుల్లో ఎల్ఈడి లైట్లను ఏర్పాటు చేశారు. డోకిపర్రు గ్రామంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా 700గృహాలకు రెడీమేడ్ మరుగుదొడ్లను ఎంఈఐఎల్ సంస్థ అందచేసింది.

తోట్లవల్లూరు మండలం భద్రిరాజు పాలెం గ్రామ ప్రజలకు రక్షిత మంచినీటిని అందించేందుకు ఎంఈఐఎల్ సంస్థ రూ. 15లక్షలతో కొమ్మారెడ్డి బసివిరెడ్డి జ్ఞాపకార్ధం ఆర్ఓ ప్లాంట్‌ను ఏర్పాటు చేయటంతో పాటు నిర్వహణ బాధ్యతను చేపట్టి ఎలాంటి అవాంతరాలు లేకుండా కొనసాగిస్తోంది. మొవ్వ మండలం కాజ గ్రామంలో స్వచ్ఛ భారత్ పథకం కింద ఉచితంగా రెడీమేడ్ మరుగుదొడ్లను ఎంఈఐఎల్ అందించింది. గ్రామం అంతటికీ ఉచితంగా పైప్లైన్ ద్వారా రక్షిత మంచినీటిని అందించేందుకు చర్యలు తీసుకొంటోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?