Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆ డైరక్టర్లు మళ్లీ తెరపైకి

ఆ డైరక్టర్లు మళ్లీ తెరపైకి

ఒకప్పుడు  డైరక్టర్ అనిపించుకుని, ఆపై టైమ్ బాగాలేక పక్కన వుండిపోయిన వాళ్లు చాలా మందే వున్నారు. అలాగే భారీ సినిమాలు తీసి బకెట్ తన్నేసి, మళ్లీ మరో ప్రయత్నం కోసం ట్రయ్ చేసే వాళ్లు వున్నారు. ఇలాంటి వాళ్లంతా ఎవరో ఒకర్ని పట్టుకుని లైమ్ లైట్ లోకి రావాలని చూస్తుంటారు. దేవా కట్టా మంచి దర్శకుడు. కానీ ‘మాయ’లో పడి మరి కనిపించలేదు. ఇప్పుడు ఓ మాంచి కథ రెడీ చేసుకున్నారట. దాన్ని హీరో నిఖిల్ కు చెప్పారని తెలుస్తోంది.

మెహర్ రమేష్ సంగతి తెలుగు ప్రేక్షకులకు తెలిసిందే. ఇటీవల మహేష్ బాబు దగ్గర కాస్త కనిపిస్తున్నారు. ఆయన కూడా ఓ మాంచి కథ రెడీ చేసుకున్నారట. వరుణ్ తేజ్ కోసం ఆ కథను నాగబాబుకు వినిపించారట. ఆయన తనకు ఓకె, వరుణ్ రావాలి, వినాలి అని పక్కన పెట్టారట. కళ్యాణ వైభోగమే సినిమా తరువాత మళ్లీ సినిమా పడలేదు నందినీ రెడ్డికి. ఓ కథ రెడీ చేసి, సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో వినిపించినా, చివరి నిమిషంలో వీటో చేసేసారు. దాంతో పట్టువదలకుండా మరో కథ తయారుచేసారట. హీరో విజయ్ దేవరకొండ కోసం.

సావిత్రి సినిమా దర్శకుడు పవన్ సాధినేని. లేటెస్ట్ గా హీరో కళ్యాణ్ రామ్ కోసం కథ తయారుచేసారు. దాదాపు ఓకె అనే స్టేజ్ లో వుంది. ఇలా అవకాశాలు అందుకోవడంలో, అందడంలో వెనుకబడిన చాలా మంది డైరక్టర్లు ఎవరి ప్రయత్నాల్లో వారు వున్నారు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?