ఐదేళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉంది. కానీ స్టార్ హీరోలు మాత్రం నందితను పట్టించుకోలేదు. ప్రేమకథాచిత్రమ్ తో మంచి హిట్ అందుకున్నప్పటికీ ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకోవడంలో నందిత పూర్తిగా ఫెయిల్ అయింది. ఇలా కెరీర్ గ్రాఫ్ పడుతూ లేస్తున్న టైమ్ లో బంగారం లాంటి ఛాన్స్ కొట్టేసింది నందిత. ఏకంగా ఎన్టీఆర్ సరసన నటించే ఆఫర్ దక్కించుకుంది.
అవును.. జై లవకుశ సినిమాలో థర్డ్ హీరోయిన్ గా నందితను ఫిక్స్ చేయబోతున్నారు. ఇప్పటికే రాశిఖన్నా, నివేదా థామస్ పేర్లను అఫీషియల్ గా ప్రకటించిన యూనిట్... మూడో హీరోయిన్ గా నందిత పేరును అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ సినిమాలో ఓ ప్రత్యేకమైన పాత్రలో నందిత ఇలా వచ్చి అలా మెరవనుందట. క్యారెక్టర్ చిన్నదే అయినా మంచి వెయిట్ ఉందని టాక్.
నారారోహిత్ తో చేసిన సావిత్రి సినిమా డిజాస్టర్ అయిన తర్వాత నందిత మళ్లీ కనిపించలేదు. లవర్స్, కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని, శంకరాభరణం, సావిత్రి.. ఇలా అన్నీ ఫ్లాపులే రావడంతో ఆమెకు అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఇలాంటి టైమ్ లో జై లవకుశ ప్రాజెక్టులో అవకాశం దక్కడం నిజంగా గొప్ప విషయమే.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు