Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అక్కడికెళితే ఎండు చేపల కర్రీ వండించుకుంటుందట

అక్కడికెళితే ఎండు చేపల కర్రీ వండించుకుంటుందట

గోదావరి జిల్లాల వాళ్ళకు ఎండు చేపలు ప్రతి కూరగాయలతో కలిపి వండుకుని తినడం బాగా అలవాటు. ఇలాంటి అలవాటే స్టన్నింగ్‌ బ్యూటీ ఇలియానాకు కూడా వుందట. గోవా తీర ప్రాంతానికి చెందిన ఇలియానా తన సొంత ఇంటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఉప్పు చేపతో కూడిన కర్రీ వండించుకుని ప్రీతిగా తింటుందట. 

గోవా బీచ్‌కి దగ్గరలో వున్న ఓ రెస్టారెంట్‌లో ఉప్పు చేపలతో ఎన్నో కర్రీస్‌ చేస్తారట. ఇలియానాకయితే ఆ రెస్టారెంట్‌లో వండినవి బాగా ఆర్డర్‌ చేసి తెప్పించుకుని తింటుందట. గోవాలో జీడి పిక్కలతో చేసే చీప్‌ లిక్కర్‌ ‘కాజు’ అనే సారాయిని తాగి ఎండు చేపలు దాన్లో నంజుకోవడం గోవా ప్రియులకు అలవాటు. అలాంటి టేస్ట్‌ ఇలియానాకు ఎందుకు నచ్చిందో అర్థం కాదుగానీ, ఎండు చేపలు తినడం వల్లే కాబోలు ఎండిపోయినట్లుండే తన శరీరాన్ని ఎంతో గొప్పగా కాపాడుకుంటుంది. 

ఈసారి ఇలియానా విశాఖపట్నం వెళితే అక్కడి రెస్టారెంట్‌లో ఉప్పు చేప, పప్పుచారు స్పెషల్‌ బావుంటుంది.. ఈ సంగతి ఇలియానాకు తెలుసో లేదో మరి. ఇలియానా ఎండు చేపల టేస్ట్‌కి మనం కూడా నోరు చప్పరించేసుకుందాం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?