Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆ ప్రాజెక్టు అలా చేతులు మారింది

ఆ ప్రాజెక్టు అలా చేతులు మారింది

టాలీవుడ్ లో ఒక ప్రాజెక్టు సెట్ అయి, తెరపైకి రావాలంటే చాలా జరుగుతుంటాయి. ఒక్కోసారి ఎక్కడో మొదలై ఎక్కడో తేలుతుంటాయి. యుద్ధం శరణం ప్రాజెక్టు సురేష్ లో మొదలై వారాహిలోకి వచ్చింది. ఇలా చాలా అంటే చాలా ఉదాహరణలు వుంటాయి. ఇప్పుడు లేటెస్ట్ ఓ ప్రాజెక్టు, యాజ్ ఇట్ ఈజ్ గా మైత్రీ మూవీస్ టేకోవర్ చేసింది.

విజయ్ దేవరకొండతో పెళ్లి చూపులు చిత్రాన్ని నిర్మించింది బిగ్ బెస్ సంస్థ. నిజానికి ఆ సంస్థ విజయ్ బంధువులదే. ఇదే సంస్థ మళ్లీ మరో సినిమా ప్లాన్ చేసింది. రఘు కమ్మ అనే కాకినాడకు చెందిన యంగ్ డైరక్టర్ తెచ్చిన మాంచి సబ్జెక్ట్ తీసుకుని, అన్నీ రెడీ చేసుకుంది. టెక్నీషియన్లు, స్టార్ కాస్ట్, అన్నీ రెడీ చేసుకుంది. ఇక షెడ్యూళ్లు వేసి స్టార్ట్ చేయడమే తరువాయి.

కానీ ఉన్నట్లుండి ఆ ప్రాజెక్టును అలా ఉన్నది ఉన్నట్లుగా మైత్రీ మూవీస్ కు ఇచ్చేసారు. మరి దీని వెనుక వున్న టెర్మ్స్ ఏమిటన్నది తెలియదు కానీ, ప్రాజెక్టు అయితే జనవరి నుంచి మైత్రీ బ్యానర్ పై మైత్రీ మూవీస్ నిర్మాతలే నిర్మిస్తారు. ఇది కూడా విజయ్ ఈ మధ్య అర్జున్ రెడ్డి సినిమాలో చేసిన హీరో పాత్రకు కాస్త దగ్గరగా వుంటుంది. అంటే యాంగ్రీ యంగ్ మాన్ అన్నమాట. ఈ సినిమాలో విజయ్ స్టూడెంట్ ఫెడరేషన్ లీడర్ గా కనిపిస్తాడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?