Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆడియో ఫంక్షన్ కు హీరో డుమ్మా?

ఆడియో ఫంక్షన్ కు హీరో డుమ్మా?

సాధారణంగా అడియో ఫంక్షన్ జరిగితే ఆ సినిమా హీరో అటెండ్ కావడం అన్నది కామన్. డబ్బింగ్ సినిమాల విషయంలోనే ఇది కాస్త మినహాయింపు. కానీ నేరుగా తెలుగులో నిర్మించే సినిమాల విషయంలో, ఎప్పుడు హీరో ఖాళీగా వుంటే అప్పుడే అడియో ఫంక్షన్ డేట్ ఫిక్స్ చేసుకుంటారు. అంతే కానీ హీరో లేకుండా అడియో ఫంక్షన్ లు జరగడం చాలా రేర్. 

నిన్నటికి నిన్న పార్క్ హయాత్ లాంటి పెద్ద హోటల్ లో ' నీ జతలేక ' అనే సినిమా అడియో ఫంక్షన్ జరిగింది. నాగ‌శౌర్య, పారుల్‌  హీరో హీరోయిన్లుగా ఓగిరాల వేమూరి నాగేశ్వర‌రావు స‌మ‌ర్పణ‌లో  శ్రీ స‌త్య విదుర మూవీస్ బ్యాన‌ర్‌పై  రూపొందుతోన్న చిత్రం `నీ..జ‌త‌లేక‌`. లారెన్స్ దాస‌రి ద‌ర్శక‌త్వంలో జి.వి.చౌద‌రి, నాగరాజుగౌడ్‌ చిర్రా ఈ చిత్రాన్ని నిర్మించారు. స్వరాజ్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్యక్రమంలో ఎన్‌.శంక‌ర్‌, సి.క‌ల్యాణ్‌ లాంటి సినిమా జనాలు పాల్గొన్నారు. కానీ హీరో మాత్రం హాజరు కాలేదు.  

ఈ వైనం వెనుక చిన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా లేటెస్ట్ సినిమా కాదు. హీరో నాగశౌర్య గతంలో ఎప్పుడో ఓకే చేసిన సినిమా.. రిలీజ్ లేటయింది అంతే. అంటే నాగశౌర్య తొలినాళ్లలో నటించిన సినిమా అన్నమాట. ఇప్పుడు నాగశౌర్యకు ఎంతో కొంత రేంజ్ వచ్చింది. దీన్ని ఆసరగా చేసుకుని, ఏదో విధంగా ఈ సినిమా విడుదలకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారట.

 అయితే అప్పట్లో ఇచ్చిన రెమ్యూనిరేషన్ ఎంత వుంటుంది. ఏదో నామినల్ గా వుంటుంది. మరి ఇప్పుడు అడియోకి రండీ.. పబ్లిసిటీ కాంపయిన్ కు రండి అంటే హీరో ఎలా వస్తాడు? అందుకే శౌర్య డుమ్మా కొట్టేసారని వదంతులు వినవస్తున్నాయి. ఈ సినిమాను ఇప్పుడు ప్రమోట్ చేయాలంటే అడిషనల్ గా ఏమయినా ఇవ్వాలని కోరుతున్నట్లు కూడా వదంతులు వినిపిస్తున్నాయి మరి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?