Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఈసారి కన్ను కీర్తిసురేష్ పై పడింది

ఈసారి కన్ను కీర్తిసురేష్ పై పడింది

హీరోయిన్ల విషయంలో నిర్మాత బెల్లంకొండ స్టయిలే వేరు. తను నిర్మించే సినిమాల్లో స్టార్ హీరోయిన్ కోసం అవసరమైతే బ్లాంక్ చెక్ ఇవ్వడానికి కూడా రెడీ. ఇప్పుడీ నిర్మాత తన కొడుకు నెక్ట్స్ సినిమా కోసం కీర్తిసురేష్ ను ట్రై చేస్తున్నాడు.

త్వరలోనే ఓంకార్ దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ బేస్డ్ సబ్జెక్ట్ లో నటించబోతున్నాడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్. ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తిసురేష్ ను ట్రై చేస్తున్నారు. అజ్ఞాతవాసి తర్వాత కీర్తిసురేష్ తన పారితోషికం కాస్త పెంచిందట. సినిమా ఫ్లాప్ అయినా కీర్తి మాత్రం రేటు తగ్గించలేదని తెలుస్తోంది. అయినప్పటికీ.. ఆమెను తీసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు నిర్మాత బెల్లంకొండ సురేష్.

తాజా సమాచారం ప్రకారం.. కీర్తిసురేష్ కు కోటి 25లక్షల రూపాయలు ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడట బెల్లంకొండ సురేష్. ఎంత అడిగితే అంత ఇచ్చి హీరోయిన్లను లాక్ చేయడం బెల్లంకొండకు కొత్త కాదు. తన కొడుకు మొదటి సినిమాకే ఏకంగా సమంతను లైన్లో పెట్టాడు. అప్పట్లో ఆమెకు బ్లాంక్ చెక్ ఇచ్చాడని టాక్. అదే సినిమాలో తమన్నతో ఐటెంసాంగ్ చేయించాడు.

ప్రస్తుతం సాక్ష్యం అనే సినిమా చేస్తున్నాడు సాయిశ్రీనివాస్. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ఓ కొలిక్కి వచ్చిన వెంటనే కీర్తి సురేష్ ఎంట్రీపై ఓ క్లారిటీ రానుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?