Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

చైతన్యతో మైత్రీ మూవీస్ సినిమా

చైతన్యతో మైత్రీ మూవీస్ సినిమా

హిట్ మీద హిట్ కొట్టి, ప్రస్తుతం రామ్ చరణ్-సుకుమార్ కాంబినేషన్ లో డిఫరెంట్ మూవీని నిర్మిస్తున్న మైత్రీ మూవీస్ సంస్థ తొలిసారి మీడియం రేంజ్ సినిమాకు శ్రీకారం చుడుతోంది. యంగ్ హీరో నాగ్ చైతన్యతో ఓ సినిమాను ప్లాన్ చేస్తోంది. అదే నాగ్ చైతన్యతో ప్రేమమ్ లాంటి సూపర్ హిట్ కొట్టిన చందు మొండేటి ఈ సినిమాకు దర్శకుడు. 

రామ్ చరణ్-సుకుమార్ సినిమాతో సంబంధం లేకుండా జూలై నుంచి ఈ సినిమా సెట్ మీదకు వెళ్తుంది. వాస్తవానికి అక్కినేని అఖిల్ తో మైత్రీ మూవీస్ సినిమా తీయాలని అనుకుంది. ప్రస్తుతం అఖిల్ - విక్రమ్ కుమార్ ప్రాజెక్టులో బిజీగా వుండడం, చైతూ కు మాంచి సబ్జెక్ట్ చెప్పి, చందు రెడీగా వుండడంతో ఈ ప్రాజెక్టు టేకప్ చేసారు.

యాభై కోట్లకు పైగా బడ్జెట్ సినిమాలు చేసిన మైత్రీ, ఇప్పుడు తొలిసారి ఇరవై కోట్ల రేంజ్ సినిమా చేయబోతోంది. ఇదిలా వుంటే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కూడా మైత్రీ మూవీస్ అడ్వాన్స్ ఇచ్చింది.మరి ఆ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు. అంతవరకు వెయిట్ చేయడం కన్నా ఇలా మీడియం గ్యారంటీ సినిమాలు చేయడం బెటరనే ఈ దారి పట్టారేమో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?