Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

చార్మి స్టామినా చూపించే ప్రయత్నం

చార్మి స్టామినా చూపించే ప్రయత్నం

జ్యోతిలక్ష్మి సినిమాకు ప్రొడక్షన్ మొత్తం చూసుకుంది హీరొయిన్ చార్మి. ఆ టైమ్ లో తనేంటో, ఆ జాబ్ లో తను ఎంత మేరకు నెంబర్ వన్ అనిపించుకోగలదో అనే టార్గెట్ తో తెగ కష్టపడిపోయింది. అన్నీ తానే చూసుకుని, వార్తల్లో నిలిచింది. ఇప్పుడు మళ్లీ మరోసారి కొత్త అవతారంలో చార్మి రెచ్చిపోతోంది. 

పూరి కనెక్ట్స్ సంస్థ ఇన్ చార్జ్ గా రోగ్ సినిమా పబ్లిసిటీ వ్యవహారాలు టేకప్ చేసింది. ఆ సినిమా కు సంబంధించిన వార్తలు నిత్యం హోరెత్తిపోవాలని టార్గెట్ గా పెట్టుకుందట చార్మి. ఆ మేరకు పక్కా ప్లానింగ్ తో డైలీ ప్రెస్ రిలీజ్ లు చేసుకుంటూ వస్తోంది. వీలయినంత వరకు అన్నీ మీడియాల్లో నిత్యం రోగ్ వార్తలు కనిపించాలన్నది చార్మి టార్గెట్ అంట. ఆమె తరపున పీఆర్ వ్యవహారాలు చూసేవారు, ఇప్పుడు ఇదే పనిపై వున్నారు. 

వీలయితే రోజుకు రెండు సార్లయినా రోగ్ వార్తలు వివిధ మాధ్యమాల్లో కనిపించో, వినిపించో హడావుడి చేయాలన్నది చార్మి ఇన్ స్ట్రక్షన్స్ గా వీళ్లు చెబుతున్నారు. అంటే ప్రొడక్షన్ నే కాదు, పబ్లిసిటీ ఫీల్డ్ ను కూడా తాను దున్నేయగలను అని ప్రూవ్ చేసే ఆలోచనలో వుందన్నమాట చార్మి. ఏమిటో ఏక్టింగ్ సెట్ కాలేదు..ప్రొడక్షన్ సెట్ కాలేదు. ఈ పూరి కనెక్ట్స్ జాబ్ అయినా సెట్ అవుతుందేమో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?