Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

చెర్రీతో మళ్లీ శృతి

చెర్రీతో మళ్లీ శృతి

రామ్ చరణ్-శృతి కలిసి మళ్లీ మరోసారి జతగా ప్రేక్షకుల మందుకు రానున్నారు. శ్రీనువైట్లతో కలిసి చెర్రీ చేయబోయే సినిమాకు కధానాయికగా శృతి ఎంపికైనట్లు తెలుస్తోంది. చరణ్ గోవిందుడు అందరి వాడేలే...శ్రీను వైట్లు ఆగడు సినిమాలు పూర్తయ్యాక ఈ ప్రాజెక్టు తెరకెక్కుతుంది. ఇప్పటికే చెర్రీ-శృతి కలిసి ఎవడులో నటించారు. 

ఆ సినిమాలో వాళ్ల జంట మాంచి మ్యాచింగ్ గా కనిపించడంతో, మరోసారి దాన్నే రిపీట్ చేయాలని డిసైడైపోయినట్లు తెలుస్తోంది. పైగా ఇప్పటికప్పుడు మరో హీరోయిన్ కూడా ఎవరూ లేరు. కొత్తవాళ్లను ట్రయ్ చేయాలి.అంతకన్నా ఇదే బెటర్ అని డిసైడ్ అయ్యారట. పైగా రేసుగుర్రం లాంటి సినిమాతో మాంచి ఊపు మీద వుంది శృతి కెరీర్. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?