Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సినిమాలపై చైతన్య క్లారిటీ

సినిమాలపై చైతన్య క్లారిటీ

రారండోయ్' సినిమా తరువాతి ప్రాజెక్టులపై హీరో నాగా చైతన్య క్లారిటీ ఇచ్చాడు. ఇవన్నీ ఇప్పటికే గ్రేట్ ఆంధ్ర వెల్లడించినవే. అయితే హీరో నాగా చైతన్య అఫీషియల్ గా కన్ ఫర్మ్ చేసాడు. సాయి కొర్రపాటి నిర్మాణంలో చేస్తున్న సినిమా రివెంజ్ థ్రిల్లర్ అని చెప్పేసాడు. తాను తొలిసారి ఈ జోనర్ లో నటిస్తున్నా అన్నాడు. ఈ ప్రాజెక్టు దాదాపు పూర్తి కావచ్చింది. దాని తరువాతి ప్రాజెక్టును వచ్చే నెలలో ప్రకటిస్తామన్నాడు.

తనతో ప్రేమమ్ సినిమాను అందించిన చందు మొండేటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తారని చెప్పాడు. మైత్రీ మూవీస్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఆ తరువాత మరే ప్రాజెక్టు చేయాలన్నది మాత్రం డిసైడ్ కాలేదని, చాలా మంది దర్శకులతో డిస్కషన్లు జరుగుతున్నాయని చెప్పాడు. వీరిలో ఒకరిద్దరు తమిళ్ డైరక్టర్లు కూడా వుండే వుండొచ్చన్నారు. కానీ ప్రాజెక్టు మాత్రం ఒక్క చందు మొండేటిది తప్ప మరేదీ ఫైనల్ కాలేదని నాగా చైతన్య క్లియర్ చేసాడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?