Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

కలెక్షన్ల అయిడియా వినాయక్ దే నంట

కలెక్షన్ల అయిడియా వినాయక్ దే నంట

టాలీవుడ్ లో ఎప్పుడూ లేని ఓ కొత్త ట్రెండ్ కు తెరతీసారు ఖైదీ నెంబర్ 150 తరపున ఏస్ ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ అల్లుఅరవింద్. 108 కోట్ల గ్రాస్ వచ్చిందటూ పబ్లిక్ గా ప్రకటించారు. సాధారణంగా ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్ కు జంకి ఇలా ఫిగర్లు బయటకు చెప్పరు. ఇప్పుడు మరి ఇన్ కమ్ టాక్స్ లెక్కల్లో ఇదే గ్రాస్ ను, దీనిపై వచ్చిన షేర్ ను, అందుకు తగిన లాభాలను చూపిస్తారో, లేదా దానికి వేరే మార్గాలేమైనా ముందుగానే ఆలోచించి వుంచారో తెలియదు. 

కానీ అసలు ఇలా కలెక్షన్లు బాహాటంగా వెల్లడించాలన్న అయిడియా మాత్రం డైరక్టర్ వివి వినాయక్ దంట. ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి అంత ఆసక్తికనబర్చలేదట. ఫ్యాన్స్ ఎలాగూ కలెక్షన్ల ట్వీట్ చేస్తున్నారు, సోషల్ వర్క్ లో పోస్ట్ లు చేస్తున్నారు కాబట్టి, ప్రత్యేకంగా చెప్పడం ఎందుకు అని చిరు భావించినట్లు తెలుస్తోంది. కానీ దానికి వినాయక్ మాత్రం చెబుదామనే ఉత్సాహం చూపించారట.

వినాయక్ ఉత్సాహం చూసి, ఇక చిరు కాదనలేక ఓకె అన్నారట.  అయితే ఎందుకయినా మంచిదని, ఈ ఈవెంట్ కు నిర్మాతగా రామ్ చరణ్ ను దూరంగా వుండమన్నారట. అంటే ఏమొచ్చినా, అది ఓ డిస్ట్రిబ్యూటర్ గా అల్లు అరవింద్ ఖాతాలో పడుతుంది కానీ, రామ్ చరణ్ చెప్పినట్లు కాదన్నమాట.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?