Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అతి విశ్వాసం కొంప ముంచుతుందా..?

అతి విశ్వాసం కొంప ముంచుతుందా..?

ధనుష్ నటించిన వీఐపీ సినిమా తెలుగులో రఘువన్ బి.టెక్ పేరుతో విడుదలైంది. టాలీవుడ్ లో కూడా ఈ సినిమా బాగా పాపులర్ అయింది. ఇప్పటికీ టీవీల్లో ఈ సినిమాకు మంచి రేటింగ్ వస్తుంది.

యూట్యూబ్ లో కూడా వ్యూస్ బాగున్నాయి. ఇలాంటి హిట్ సినిమాకు సీక్వెల్ తీశాడు ధనుష్. ఈసారి తెలుగు, తమిళ్ పాటు బాలీవుడ్ ను కూడా టార్గెట్ చేశాడు.

తమిళ్ లో ఈ సినిమాను వీఐపీ-2గానే వ్యవహరిస్తున్నారు. అటు బాలీవుడ్ లో కూడా ఇదే పేరును కొనసాగించాలని నిర్ణయించారు. ఎటొచ్చి తెలుగు టైటిల్ తోనే చిక్కొచ్చిపడింది. తెలుగులో దీన్ని రఘువరన్-2గా విడుదల చేస్తే బాగుంటుంది. కానీ మేకర్స్ మాత్రం వీఐపీ-2 పేరుతోనే విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. 

మరోవైపు రఘువరన్ బి.టెక్ సినిమా సక్సెస్ తో పార్ట్-2ను తెలుగులో సొంతంగా విడుదల చేయాలని భావిస్తున్నాడట ధనుష్. మొదటి సినిమా హిట్ అయింది కాబట్టి సీక్వెల్ కు వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు సొంత రిలీజ్ కు వెళ్తున్నట్టు తెలుస్తోంది.

దాదాపు 2 దశాబ్దాల విరామం తర్వాత వీఐపీ-2 సినిమాతో మరోసారి సౌత్ కు వచ్చింది బాలీవుడ్ నటి కాజోల్. ధనుష్ భార్య సౌందర్య రజనీకాంత్ ఈ సినిమాకు దర్శకురాలు. వచ్చేనెల 28న వీఐపీ-2ను విడుదల చేయాలని భావిస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?