Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

కొత్త సంఘమిత్ర దొరికేసిందోచ్!

కొత్త సంఘమిత్ర దొరికేసిందోచ్!

శృతిహాసన్ తప్పుకున్నప్పట్నుంచి ఈ స్థానం ఖాళీగానే ఉంది. మధ్యలో చాలామంది తారల పేర్లు పరిశీలించినా ఏదీ వర్కవుట్ కాలేదు. చివరికి బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీని నయా సంఘమిత్రగా ఎంపిక చేసింది యూనిట్. త్వరలోనే దీనిపై అఫీషియల్ స్టేట్ మెంట్ రాబోతోంది.

స్క్రీన్ ప్లేలో మార్పులు, యూనిట్ వ్యవహారశైలి నచ్చక 450కోట్ల రూపాయల సంఘమిత్ర ప్రాజెక్టు నుంచి తప్పుకుంది శృతిహాసన్. ఆ తర్వాత హన్సికతో పాటు పలువురు హీరోయిన్ల ప్రొఫైల్స్ పరిశీలించారు. చివరికి దిశా పటానీని ఎంపిక చేశారు.

పూరిజగన్నాథ్ డైరక్ట్ చేసిన లోఫర్ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. ఫిట్ నెస్ విషయంలో ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది. సంఘమిత్ర ఛాన్స్ రావడానికి ఇదొక రీజన్ కాగా, ఎన్ని కావాలంటే అన్ని కాల్షీట్లు ఇవ్వడానికి దిశా పటానీ ఒప్పుకోవడం మరో రీజన్.

తేనాండాళ్ ఫిలిమ్స్ బ్యానర్ పై రానున్న ఈ సినిమాకు ఖుష్బూ భర్త సుందర్ దర్శకుడు. ఏఆర్ రెహ్మాన్ ఈ ప్రాజెక్టుకు సంగీతం అందించబోతున్నాడు. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ సినిమాను అఫీషియల్ గా ఎనౌన్స్ చేయడంతో పాటు గ్రాండ్ గా ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?