Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

హోటల్ బిజినెస్ లోకి సురేందర్ రెడ్డి

సినిమా జనాలందరికీ హోటల్ బిజినెస్ అంటే మహా ఇష్టం. నాగార్జున దగ్గర నుంచి సందీప్ కిషన్ దాకా చాలా మంది హోటల్ బిజినెస్ లే రన్ చేస్తున్నారు. సమంత, నితిన్ వగైరా కూడా ఈ జాబితాలో వున్నారు.

టాలీవుడ్ టాప్ డైరక్టర్ లలో ఒకరైన సురేందర్ రెడ్డి కూడా ఇప్పడు ఈ జాబితాలో చేరిపోయారు. హైదరాబాద్ లో పాపులర్ అయిన ఉలవచారు బ్రాండింగ్ రెస్టారెంట్ లతో ఆయన చేతులు కలిపారు. అందులో భాగంగా కొత్త బ్రాంచ్ ను గచ్చిబౌలి ప్రాంతంలో ఈరోజు ఓపెన్ చేసారు.

టాలీవుడ్ కు చెందిన హేమా హేమీలు ఈ సందర్భంగా వచ్చి సురేందర్ రెడ్డిని అభినందించారు. టాప్ హీరోలు అల్లు అర్జున్, రామ్ చరణ్ కూడా ఈ ఈవెంట్ కు హాజరయ్యారు. టీఆర్ఎస్ నేత, ఎంపీ కవిత కూడా ఈ ఫంక్షన్ కు ప్రత్యేకంగా హాజరుకావడం విశేషం.

వీడియో కోసం క్లిక్ చేయండి 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?