Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సినిమా ఫ్లాప్.. డబ్బులు వెనక్కి ఇస్తాడా?

సినిమా ఫ్లాప్.. డబ్బులు వెనక్కి ఇస్తాడా?

జగ్గా జాసూస్ విడుదలైన మొదటి రోజునే ఓ పెద్ద స్టేట్ మెంట్ ఇచ్చేశాడు రణబీర్ కపూర్. తన సినిమా సూపర్ హిట్ అవుతుందని, ఒకవేళ ఫెయిల్ అయితే నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లను ఆదుకునే బాధ్యతను తను తీసుకుంటానని ప్రకటించాడు. అంతేకాదు, తన తాతల కాలం నుంచి ఇలా డిస్ట్రిబ్యూటర్లను ఆదుకునే ఘనత తమ వంశానికి ఉందని గొప్పలు చెప్పాడు. మరి రణబీర్ ఇప్పుడేం చేస్తాడో చూడాలి. ఎందుకంటే జగ్గా జాసూస్ సినిమా ఫ్లాప్ అయింది.

బాలీవుడ్ ఎనలిస్ట్ లు చెబుతున్న సమాచారం ప్రకారం.. 110కోట్ల రూపాయలతో తెరకెక్కిన జగ్గాజాసూస్ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడం కూడా కష్టమే అంటున్నారు. ఈ సినిమాను దేశీయంగానే దాదాపు 200కోట్ల రూపాయలకు అమ్మారు. కానీ విడుదలై వారం రోజల్లో ఈ మూవీకి దేశవ్యాప్తంగా జస్ట్ 50కోట్ల రూపాయలు మాత్రమే వచ్చింది. 

మొదటి 3రోజులకే వంద కోట్లు కలెక్ట్ చేసేంత స్టామినా ఉంది బాలీవుడ్ సినిమాకు. కానీ రణబీర్ మూవీకి మాత్రం వారం గడిచినా 50కోట్లు కూడా రాలేదు. 2వారాల తర్వాత సినిమా థియేటర్లలో ఉండడమే కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో జగ్గా జాసూస్ లాభాల బాట పట్టడం దాదాపు అసాధ్యం అనేది విశ్లేషకుల మాట. 

మరి చెప్పిన మాట ప్రకారం ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన రణబీర్ కపూర్.. డిస్ట్రిబ్యూటర్లను ఆదుకుంటాడా.. లేక ఎప్పట్లానే ఓ నెల రోజుల పాటు ఎవరికీ కనిపించకుండా పోతాడా అనేది చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?