Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఇన్ సైడ్ టాక్ : జైలవకుశ రిలీజ్ డేట్ లో మార్పు

ఇన్ సైడ్ టాక్ : జైలవకుశ రిలీజ్ డేట్ లో మార్పు

బాబాయ్-అబ్బాయ్ మధ్య బాక్సాఫీస్ వార్ అనివార్యమైంది. ప్రస్తుతానికైతే ఎవరూ తగ్గడం లేదు. సినిమాను ప్రారంభించిన రోజే తన మూవీని సెప్టెంబర్ 29న విడుదల చేయబోతున్నట్టు బాలకృష్ణ ప్రకటించాడు.

బాలయ్య సినిమాకు సరిగ్గా వారం రోజుల ముందు, అంటే సెప్టెంబర్ 21న జై లవకుశ సినిమాను రిలీజ్ చేయాలని నిర్ణయించాడు ఎన్టీఆర్. దీంతో వీళ్లిద్దరి మధ్య ఈసారి రసవత్తర పోరు తప్పదని అంతా ఫిక్స్ అయిపోయారు.

జస్ట్ వారం రోజుల గ్యాప్ లోనే నందమూరి హీరోల సినిమాలు ఇలా బాక్సాఫీస్ బరిలో పోటీపడడం మంచి సంకేతం కాదు. దీని వల్ల 2 సినిమాలు నష్టపోవడంతో పాటు పరిశ్రమకు తప్పుడు సంకేతాలు ఇచ్చినట్టు అవుతుంది. అయితే ఎన్టీఆర్, బాలయ్యలో ఎవరు తగ్గుతారనేది ఇప్పుడు ప్రశ్న. దీనికి సమాధానం కూడా సింపుల్.

పైసా వసూల్ తో పోలిస్తే జై లవకుశ సినిమానే తగ్గే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే పైసా వసూల్ సినిమా రిలీజ్ డేట్ ను అందరి కంటే ముందే ఎనౌన్స్ చేశారు.

ఇదొక కారణం అయితే, జై లవకుశ సినిమాను నిర్మిస్తున్న నిర్మాత కల్యాణ్ రామ్, కోరి బాలకృష్ణతో వైరం తెచ్చుకోడు. ఇప్పటివరకు ప్రతి విషయంలో బాలకృష్ణకు అనుకూలంగానే వ్యవహరించాడు కల్యాణ్ రామ్.

ఇక టెక్నికల్ రీజన్స్ విషయానికొస్తే జై లవకుశ సినిమాను నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేయడానికి రెడీ అవుతున్న దిల్ రాజు.. విడుదల తేదీని మార్చాలని పట్టుబడుతున్నాడు. సో.. తాజా సమాచారం ప్రకారం జై లవకుశ సినిమాను చెప్పిన తేదీ కంటే వారం రోజుల ముందే విడుదల చేసే ఛాన్స్ ఉంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?