Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

జంకుతున్న ఆ ఇద్దరు హీరోలు

జంకుతున్న ఆ ఇద్దరు హీరోలు

పెద్ద నిర్మాత, పెద్ద బ్యానర్. సినిమాలు చేయడానికి ఇద్దరు హీరోలు ఓకె అన్నారు. కానీ ఇప్పుడు తీరా చేసి, డైరక్టర్ పలానా అని వార్తలు వినవస్తుంటే మాత్రం కాస్త గుబులు పడుతున్నారట. ఇంతకీ విషయం ఏమిటంటే, దిల్ రాజు బ్యానర్ లో సినిమాలు చేయడానికి హీరోలు నిఖిల్, రాజ్ తరుణ్ సై అన్నారు. నిఖిల్ సినిమా చందు మొండేటి డైరక్టర్ అని అనుకున్నారు కూడా.

కానీ ఇప్పుడు డైరక్టర్ హరీష్ శంకర్ ఈ ఇద్దరిలో ఎవరికి సూటయ్యే కథ తయారుచేస్తే వారితో చేయాలని నిర్మాత దిల్ రాజు ఆలోచిస్తున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ విషయం ఆ నోటా ఈ నోటా విని ఇద్దరు హీరోలు వెనకడుగు వేస్తున్నట్లు వినికిడి. నిజానికి నిఖిల్ తో సినిమాకు చాలా టైమ్ వుంది. కానీ రాజ్ తరుణ్ ప్రస్తుతం చేస్తున్న అన్నపూర్ణ, ఏకె సంస్థల సినిమాలు పూర్తి కాగానే దిల్ రాజు బ్యానర్ లో సినిమా స్టార్ట్ అవుతుంది.

మరి దానికి హరీష్ శంకర్ డైరక్టర్ అంటే రాజ్ తరుణ్ ఏమంటాడో? అందులోనూ కథ నచ్చకపోతే, రాజ్ తరుణ్ అస్సలు ఓకె అనడు. గతంలో పెద్ద బ్యానర్లు చాలా వదులుకున్నాడు ఇలా. మరి ఈసారి ఏమవుతుందో? నిఖిల్ కూడా అంతే. ప్రాజెక్టు నచ్చకపోతే టక్కున తప్పుకుంటాడు. అందువల్ల హరీష్ శంకర్ ఈసారి బలమైన కథ తయారు చేస్తే తప్ప ఈ ఇద్దరు హీరోలు ఓకె అనడం కష్టం. గతంలోలా ఆ సినిమా, ఈ సినిమా కలిపి కొత్త కథ చేస్తానంటే కుదరదేమో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?