Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఖైదీలోనే కాదు బాహుబలిలోనూ మంత్రే

ఖైదీలోనే కాదు బాహుబలిలోనూ మంత్రే

థర్టీ ఇయర్స్ పృధ్వీకి న్యూ ఇయర్ లో ఖైదీ 150 షాక్ ఇచ్చింది. పాత్రను అడ్డగోలుగా కోసేసింది. పాపం, మంత్రి పాత్రలో మెరిసిపోదామనుకున్న పృధ్వీ ఆశలు అడియాసలయ్యాయి. అయితే అదే మంత్రి పాత్ర మరోటి ఇదే ఇయర్ లో రాబోతోందని ఆయనే వెల్లడించేసాడు. 

బాహుబలిలో దేవసేనకు మంత్రిగా పృధ్వీ కనిపించబోతున్నాడు. అంటే పార్ట్ టూ లో కొత్తగా కనిపించే నటుల జాబితాలో పృధ్వీ పేరు కూడా చేరింది. పృధ్వీ ఈ విషయాన్ని ఆనందంగా చెప్పేసాడు. అంతే కాదు, ఇది కామెడీ వేషం కాదని, సీరియస్ వేషమని కూడా వెల్లడించేసాడు. 

సాధారణంగా తన సినిమాలోని వ్యవహారాల గురించి కానీ, పాత్రల గురించి కానీ బయట ముందుగా వెల్లడించడం దర్శకుడు రాజమౌళికి ఇష్టం వుండదు. కానీ పృధ్వీ వ్యవహారం వేరు. మనసులో బాధా దాచుకోలేడు..మాటా దాచుకోలేడు. మొన్న ఖైదీ పై కక్కేసాడు. ఇప్పుడు బాహుబలి- 2లో పాత్ర గుట్టు విప్పేసాడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?