Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

క్రిష్ కు బీపీ పెరిగిపోతోందట

క్రిష్ కు బీపీ పెరిగిపోతోందట

కిష్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న కంచె సినిమా ట్రయిలర్ సంచలనాలు సృష్టిస్తోంది. ఈ ట్రయిలర్ బయటకు వచ్చిన మరుక్షణం నుంచి క్రిష్ ఫోన్ ఎంగేజ్ వస్తోందట. ఈ స్టార్ ఆ స్టార్ అని లేకుండా, మెగాస్టార్ మొదలుకుని తమిళ సూపర్ స్టార్ సూర్య వరకు ప్రతి ఒక్కరు అభినందలు అందించారట.  

అందరికన్నా ముందుగా మహేష్ బాబు నుంచి అభినందన అందిందట. ఆ తరువాత నుంచి ఆ వెల్లువ అలా అలా పెరిగిపోయిందట. దీంతో క్రిష్ కు టెన్షన్ మొదలయిందట. టీజర్ క్రియేట్ చేసిన పాజిటివ్ బజ్ ను అందుకోవాల్సి వుంది. నిలబెట్టుకోవాల్సి వుంది.

ప్రస్తుతం సినిమా రీరికార్డింగ్ పనిలో ఆయన బిజీగా వున్నారు. మరో పక్క అభినందనలు, ఫోన్ కాల్స్. వెరసి క్రిష్ కు బీపీ పెరిగిపోతోందట.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?