Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

క్రిష్ పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరమ్

క్రిష్ పై బాలయ్య ఫ్యాన్స్ గరం గరమ్

గౌతమీ పుత్ర శాతకర్ణి లాంటి వైవిధ్యమైన, విజయవంతమైన సినిమాను బాలకృష్ణకు వందో సినిమాగా అందించాడు దర్శకుడు క్రిష్. ఓ దర్శకుడిగా క్రిష్ కు నూటికి నూరు మార్కులు వేస్తున్న బాలయ్య ఫ్యాన్స్ నిర్మాతగా మాత్రం కాస్త అసంతృప్తిగానే ఫీలవుతున్నారు. 

బాలయ్య వందో సినిమా నిర్మించాల్సింది సాయి కొర్రపాటి. కానీ అనుకోకుండా అప్పటికప్పుడు క్రిష్ రంగ ప్రవేశం చేసారు. తామే నిర్మిస్తామన్నారు. బడ్జెట్ దగ్గర రాజీ పడమన్నారు. తక్కువ బడ్జెట్ లో భారీ లుక్ వచ్చేలా నిర్మించారు. అంతవరకు బాగానే వుంది. కానీ ముందు అనుకున్నట్లు 11న విడుదల చేయడం లో మాత్రం క్రిష్ వెనకగడుగు వేసారు. ఇప్పుడు అదే బాలయ్య ఫ్యాన్ అసంతృప్తికి కారణమవుతోంది.

తమ సినిమా 12న అని ముందు నుంచీ చెబుతూ వచ్చి, తీరా మెగాస్టార్ సినిమా 11న వస్తానంటే తాము 11న రావడానికి బదులు వెనక్కు తగ్గిపోవడం సరిగ్గా లేదంటున్నారు. 13న వస్తానన్న ఖైదీ మాట మార్చి 11న వచ్చినపుడు తాము కూడా 11న వచ్చి వుండాల్సిందన్నది నందమూరి ఫ్యాన్స్ వాదన. 

అలా వచ్చి వుంటే 11న ఖైదీకి సోలో వసూళ్లు దక్కేవి కావని వారి అభిప్రాయం.కానీ క్రిష్ కు మెగా క్యాంప్ తో వున్న మొహమాటాలు లేదా నిర్మాతగా తన సినిమాకు ఏమవుతుందో అన్న భయం కలిసి 12కే ఫిక్స్ అయ్యేలా చేసిందని వారు విమర్శిస్తున్నారు. 

ఇదే సాయి కొర్రపాటి అయితే ఇలాచేసేవారే కాదని వారు కామెంట్ చేస్తున్నారు. అంత భయం వున్నవారు ఇలాంటి ప్రతిష్టాత్మక చిత్రం నిర్మించడానికి ముందుకు రాకూడదని, వారాహి కే వదిలేసి వుంటే సరిపోయేదని నందమూరి అభిమానులు వాదిస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?