Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

కేవి రెడ్డిగా క్రిష్

కేవి రెడ్డిగా క్రిష్

డైరక్టర్ క్రిష్ తొలిసారి తెర ముందుకు వస్తున్నారు. విభిన్నమైన సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న క్రిష్ ఇప్పడు తెరపై కనిపించబోతున్నారు. అలనాటి హీరోయిన్ సావిత్రి జీవితగాధను మహానటి పేరుతో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

టాలీవుడ్ కు చెందిన హేమాహేమీలు ఎందరో ఈ సినిమాలో కనిపించబోతున్నారు. సావిత్రి, ఎస్వీరంగారావు, ఎన్టీఆర్, ఏఎన్నార్ లు నటించిన అలనాటి కళాఖండం మాయాబజార్ ప్రస్తావన కూడా సినిమాలో వుంటుంది.

ఎస్వీ రంగారావుగా మోహన్ బాబు కనిపించబోతున్నారు. ఎన్టీఆర్, ఎఎన్నార్ క్యారెక్టర్ల కోసం నాగ్ చైతన్య, ఎన్టీఆర్ లను ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి ఈ ఎపిసోడ్ లో మాయాబజార్ డైరక్టర్ కేవి రెడ్డి దీ కీలకపాత్రే.

ఈ పాత్రకు డైరక్టర్ క్రిష్ ను సంప్రదించారు. ఆయన ఒకె అన్నారు. అదే సమయంలో ఈ ఎపిసోడ్ ను చిత్రీకరించడం కోసం సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు సహాయం తీసుకుంటున్నారు. అప్పటి సంగతులు తెలిసిన ఒకరిద్దరిలో ఆయన ఒకరు.  అందుకే ఆయనను పర్యవేక్షణకు తీసుకున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?