Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మహేష్‌ రావడమే లేట్‌

మహేష్‌ రావడమే లేట్‌

పూరి జగన్నాథ్‌కి ఒక పది రోజులు తీరిక దొరికితే కొత్త కథ రాసి పారేస్తాడనేది తెలిసిందే. ఎన్టీఆర్‌ సినిమా షెడ్యూల్‌ లేట్‌ అవడంతో ఆ గ్యాప్‌లో పూరి తన కొత్త సినిమాకి కథ రాసేసాడు. మహేష్‌కి గతంలోనే వినిపించిన స్టోరీ లైన్‌ని పూర్తిగా సిద్ధం చేసేసాడని సమాచారం. 

ఆగడు ఫ్లాప్‌ అయిన తర్వాత పూరి జగన్నాథ్‌తో వెంటనే ఒక సినిమా చేయాలని మహేష్‌ ఫిక్స్‌ అయ్యాడు. తనతో పోకిరి, బిజినెస్‌మేన్‌ చిత్రాలతో వరుస హిట్స్‌ కొట్టిన పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో హ్యాట్రిక్‌ కంప్లీట్‌ చేయాలని మహేష్‌ చూస్తున్నాడు. అయితే కొరటాల శివ చిత్రం పూర్తి చేసిన తర్వాతే ఈ చిత్రం మొదలు పెడతాడు. 

పూరి కూడా ఎన్టీఆర్‌ చిత్రం చేసిన తర్వాతే మహేష్‌తో మూవీ స్టార్ట్‌ చేస్తాడు. మహేష్‌తో మూడు నెలల్లో సినిమా పూర్తి చేసి విడుదల చేసే విధంగా పూరి ప్రణాళిక వేసుకుంటున్నాడు. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్‌ బ్యానర్‌పై కానీ పూరి సొంత నిర్మాణ సంస్థపై కానీ ఉంటుందని తెలిసింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?