Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మహేష్-దిల్ రాజు సినమాకు రేపు శ్రీకారం

మహేష్-దిల్ రాజు సినమాకు రేపు శ్రీకారం

సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినిమాల ప్లానింగ్ మరింత స్పీడ్ చేసినట్లు కనిపించింది. టిపికిల్ ప్రాజెక్టు కావడంతో స్పైడర్ సినిమా చాలా టైమ్ తీసుకుంది. అందుకే, అది దాదాపు ఫినిషింగ్ స్టేజ్ కు రాగానే కొరటాల శివ డైరక్షన్ లో భరత్ అనే నేను సినిమా స్టార్ట్ చేసారు. సంక్రాంతికి విడుదల చేయడానికి చకచకా పని కానిస్తున్నారు. 

ఇదిలా వుండగానే ఎప్పుడో అన్ని విధాలా ఓకె అయిపోయిన వంశీ పైడిపల్లి సినిమాకు కూడా క్లాప్ కొట్టిస్తున్నారు. దిల్ రాజు, అశ్వనీదత్ నిర్మించే ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకుడు. పివిపి బ్యానర్ లో ఊపిరి సినిమా అనంతరం వంశీ పైడి పల్లి ఈ సినిమా చేయాల్సి వుంది. కారణాంతరాల వల్ల అది దిల్ రాజు యూనిట్ కు వచ్చింది.

ఈ సినిమాకు రేపు ఉదయం క్లాప్ కొడుతున్నారు. ఇటీవలే దిల్ రాజు నిర్మాతగా 25 సినిమాలు పూర్తి చేసుకుంటే, ఇప్పుడు ఈ సినిమా మహేష్ బాబుకు హీరోగా 25వ సినిమా కావడం విశేషం. అన్నపూర్ణలో ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఎప్పటి లాగే సెంటి మెంట్ ప్రకారం మహేష్ బాబు రారు. కానీ దిల్ రాజుతో, అశ్వనీదత్ తో అసోసియేట్ అయిన సెలబ్రిటీలు అందరూ హాజరవుతారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?