Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మళ్లీ మొదటికి వచ్చిన వివాదం

మళ్లీ మొదటికి వచ్చిన వివాదం

కలిసి సినిమాలు చేసినంతకాలం బాగానే గడచిపోయింది. నష్టాలు మూటకట్టకుని, సినిమాలు ఆపేసాక అసలు గొడవలు బయటకు వస్తున్నాయి. దాదాపు ఏడాది క్రితం కావచ్చు, నిర్మాత చింతలపూడి శ్రీనివాసరావుకు, అక్కినేని వారింటి ఆడపడుచు నాగ సుశీలకు మధ్య వివాదం రాజుకుంది. సినిమాల కన్నా ముందుగా రియల్ ఎస్టేట్ బిజినెస్ తోనే చింతలపూడి శ్రీనివాసరావు అక్కినేని కుటుంబానికి పరిచయం. ఎన్నో లావాదేవీలు వారి మధ్య నడిచాయని వినికిడి.

అక్కడి నుంచి సిన్మా నిర్మాణంలోకి భాగస్వాములు అయ్యారు. కేవలం నాగసుశీల కుమారుడు సుశాంత్ తో మాత్రమే సినిమాలు నిర్మించారు. ఆ సినిమాలు ఎలా ఆడాయో అందరికీ తెలిసిందే.

కానీ ఆ తరువాత ఇరు వర్గాల మధ్య గొడవలు ప్రారణభమయ్యాయి. కోర్టుకు వెళ్లారు. అక్కడితో విషయం సద్దు మణిగింది అనుకుంటే, ఇప్పుడు మళ్లీ నాగ సుశీల పోలీసు ఫిర్యాదుతో మళ్లీ రగిలింది. తన సంతకం ఫోర్జరీ చేసి తన ఆస్తులు అమ్మేసారన్నది నాగ సుశీల ఫిర్యాదు.

అంతా అబద్దం అని, నాగార్జున పలుకుబడితో తనను ఇబ్బంది పెట్టాలని నాగ సుశీల చూస్తున్నారని శ్రీనివాసరావు అంటున్నారు. కేసు కోర్టు పరిథిలో వుంది కాబట్టి, ఫిర్యాదు మీద పోలీసులు జాగ్రత్తగానే వ్యవహరించే అవకాశం వుంది.

పైగా శ్రీనివాసరావు ముందే డిఫెన్స్ లోకి వెళ్లిపోయారు కాబట్టి, పెద్దవాళ్లకు మాట రాకుండా, జాగ్రత్తగా దర్యాప్తు చేసే అవకాశం వుంది. ఈ దర్యాప్తులో ఏం తేలుతుందో చూడాలి. నాగ సుశీల, శ్రీనివాస రావు వ్యవహారం పుణ్యమా అని మరోసారి నాగార్జున వార్తల్లోకి ఎక్కారు.

కేటిఆర్ తో సాన్నిహిత్యంతో ఆయన తనను ఏదైనా చేయవచ్చని శ్రీనివాసరావు ముందే ఓ బాణం వేసేసారు. నాగ్ గతంలో ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించాలని ప్రయత్నించారు. వీలుకాలేదు. ఇప్పుడు మళ్లీ తన సన్నిహితుల ద్వారా ప్రయత్నం స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?