నిర్మాతగా, హీరోయిన్ గా, టీవీ ప్రయోక్తగా, ఇలా అన్ని విధాలా తన టాలెంట్ చూపిస్తూ వస్తున్న మంచు లక్ష్మి వెబ్ సిరీస్ లో కూడా అడుగుపెడుతున్నారు. త్వరలో యుప్ టీవీ ద్వారా మంచు లక్ష్మి కొన్ని వెబ్ సిరీస్ అందించబోతున్నట్లు తెలుస్తోంది.
గతంలో దొంగాట, కిట్టూగాడు వున్నాడు జాగ్రత్త వంటి డిఫరెంట్ సినిమాలు అందించిన వంశీకృష్ణతో కలిసి ఆమె ఈ వెబ్ సిరీస్ ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
యుప్ టీవీ ఇటీవల చాలా చురుగ్గా వెబ్ సిరీస్ అందిస్తోంది. ఈ సిరీస్ కోసం పలువురు సినిమా జనాలను ఎంగేజ్ చేస్తోంది. వాళ్ల అనుభవాన్ని వెబ్ సిరీస్ కు వాడుకుంటోంది.
ఇప్పుడు అందులో భాగంగానే మంచులక్ష్మి-వంశీకృష్ణ కాంబినేషన్ లో ఓ ప్రాజెక్టును ఓకె చేసినట్లు వినికిడి. అయితే జోనర్ ఏమిటన్నది ఇంకా తెలియదు. ఫన్ అండ్ ఎంటర్ టైనర్ గా వుంటుందని మాత్రం తెలుస్తోంది.
ప్రస్తుతం మంచు లక్ష్మి హీరోయిన్ గా ఓ సినిమా చేస్తున్నారు.
అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు