Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఎంసిఎ పంచాయతీ పూర్తి?

ఎంసిఎ పంచాయతీ పూర్తి?

డిసెంబర్ లో విడుదల డేట్ లు టైట్ అయిపోయాయి. ముఖ్యంగా డిసెంబర్ మూడోవారంలో వస్తున్న వరుస సెలవులపై సినిమాల కన్ను పడింది. ఆ డేట్ ను నాగార్జున ఎప్పుడో లాక్ చేసారు. హలో సినిమాను రెడీ చేసారు. కానీ ఇంతలో దిల్ రాజు తన ఎంసిఎ సినిమాను 21విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. మరోపక్క అల్లు అరవింద్ తన కొడుకు శిరీష్ సినిమా ఒక్కక్షణంను 23న విడుదల చేస్తామని అనౌన్స్ చేసారు.

దీంతో డేట్ల పంచాయతీ తప్పలేదు. నిన్నటికి నిన్న అంటే మంగళవారం రాత్రి పొద్దుపోయేవరకు ఈ పంచాయతీ జరిగినట్లు తెలుస్తోంది. దిల్ రాజు ముందుగా 15అని అనబట్టే కదా, తాము 23అని ప్రకటించాం అని గీతా సంస్థ జనాలు అన్నట్లు తెలుస్తోంది. తాము డేట్ ప్రకటించి ఇప్పుడు వెనక్కు వెళ్తే ఏం బాగుంటుంది? అని అన్నట్లు వినికిడి. ఇలా డిస్కషన్లు సుదీర్ఘంగా సాగిన తరువాత ఎంసిఎ 15రావడానికి అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. 22న హలో, 23న ఒక్కక్షణం వస్తాయి.

అయితే సమస్య మరోకటి వుంది. ఏ సినిమా కూడా ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పక్కాగా పూర్తి కాలేదు. హలో, ఎంసిఎ, ఒక్కక్షణం, ఇలా అన్నింటికీ పనులు బాకీ వున్నాయి. అదే కాదు డిసెంబర్ లో రావాలనుకుంటున్న చాలా సినిమాలకు పనులు బాకీ వున్నాయి. దాంతో ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ పనులపై బిజీ బిజీగా వుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?