Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

మూడు వారాల ముందే పైసా వసూల్ రిలీజ్?

మూడు వారాల ముందే పైసా వసూల్ రిలీజ్?

బాలకృష్ణ-పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పైసా వసూల్ సినిమా అనుకున్న తేదీ కంటే ముందే సిద్ధమౌతోందని, కుదిరితే నెలరోజుల ముందే సినిమాను విడుదల చేసే అవకాశముందని గ్రేట్ ఆంధ్ర ఇప్పటికే  తెలిపింది. అదే నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సినిమాను సెప్టెంబర్ 29న కాకుండా.. సెప్టెంబర్ మొదటివారంలోనే థియేటర్లలోకి తీసుకురావాలని అనుకుంటున్నారు మేకర్స్.

అనుకున్న టైమ్ కంటే ముందే పైసా వసూల్ షెడ్యూల్స్ కంప్లీట్ అయ్యాయి. మరీ ముఖ్యంగా పోర్చుగల్ షెడ్యూల్ సాఫీగా సాగడంతో మూవీ టాకీ ముందుగానే పూర్తయింది. దీనికి తోడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా శరవేగంగా పూర్తయింది. ఫస్ట్ కాపీ రెడీ అయిన తర్వాత కూడా ఎక్కువ రోజులు వెయిట్ చేయడం మంచిది కాదని బాలకృష్ణ సూచించడంతో.. కాస్త ముందుగానే సినిమాను థియేటర్లలోకి తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారు.

అయితే తమ సినిమాను కాస్త ముందుగానే రిలీజ్ చేయడానికి డ్రగ్స్ కేసుకు సంబంధం లేదంటున్నారు మేకర్స్. డ్రగ్స్ కేసులో పూరి జగన్నాథ్ ఇప్పటికే విచారణ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. దానితో తమ సినిమాకు సంబంధం లేదంటున్నారు యూనిట్ సభ్యులు. మరోవైపు మహేష్ నటిస్తున్న స్పైడర్ సినిమా బరిలో నిలవడం వల్ల పైసా వసూల్ ను కాస్త ముందుగానే విడుదల చేస్తున్నారనే వాదనను కూడా యూనిట్ సభ్యులు తోసిపుచ్చుతున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?