Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

టాలీవుడ్ లో మిస్టరీ కాంబినేషన్లు

టాలీవుడ్ లో మిస్టరీ కాంబినేషన్లు

రామ్ చరణ్, కొరటాల శివ.. టాలీవుడ్ లో ఇదొక మిస్టరీ కాంబినేషన్ గా మారింది. అసలు వీళ్లిద్దరూ కలిసి సినిమా చేస్తారా చేయరా అనేది పెద్ద ప్రశ్న. వాస్తవానికి ఈ పాటికి చెర్రీ-కొరటాల కాంబోలో సినిమా ఒకటి థియేటర్లలోకి వచ్చేయాలి. ముహూర్తం షాట్ కూడా ముగిసిన తర్వాత సినిమా ఆగిపోయింది. మహేష్ తో కొరటాల చేయబోయే సినిమా తర్వాత వస్తుందని ఎక్స్ పెక్ట్ చేసినప్పటికీ అది కూడా జరగలేదు. ఎందుకంటే, మహేష్ తో చేయబోయే సినిమా తర్వాత మరోసారి ఎన్టీఆర్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు కొరటాల.

పవన్ కల్యాణ్, నేసన్.. ఈ కాంబినేషన్ కూడా మిస్టరీగానే మారింది. ఏఎం రత్నం సమర్పణలో నేసన్ దర్శకత్వంలో సినిమాకు పవన్ కొబ్బరికాయ కూడా కొట్టాడు. కానీ సినిమాను పట్టాలపైకి తీసుకురావడానికి మాత్రం ఇంట్రెస్ట్ చూపించడం లేదట. త్రివిక్రమ్ సినిమా కంప్లీట్ అయిన తర్వాత మరో దర్శకుడికి ఛాన్స్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాడట. ప్రస్తుతానికి దీనిపై ఎలాంటి అప్ డేట్ లేదు.

తాజాగా ఈ లిస్ట్ లోకి బన్నీ-విక్రమ్ కుమార్ సినిమా కూడా చేరిపోయింది. డేట్స్ ఎడ్జస్ట్ కాకపోవడంతో విక్రమ్ కుమార్ తో సినిమా చేయలేకపోయానని, డీజే కంప్లీట్ అయిన వెంటనే విక్రమ్ కుమార్ తో సినిమా ఉంటుందని ఆ మధ్య ప్రకటించాడు బన్నీ. కానీ డీజే తర్వాత వక్కంతంతో సినిమా చేయబోతున్నాడు అల్లు అర్జున్. అటు బన్నీ-లింగు స్వామి కాంబోలో తెలుగు-తమిళ భాషల్లో రావాల్సిన సినిమా కూడా మిస్టరీగానే మారింది.

ఇలాంటిదే మరో మిస్టరీ కాంబినేషన్ మహేష్-గౌతమ్ మీనన్. ఎప్పుడు గౌతమ్ మీనన్ ను అడిగినా మహేష్ తన స్టోరీలైన్ కు ఓకే చేశాడనే చెబుతాడు గౌతమ్ మీనన్. జేమ్స్ బాండ్ టైపు స్టోరీతో మహేష్ తో సినిమా చేస్తానంటాడు. దాదాపు ఐదేళ్లుగా నలుగుతున్న ఈ స్టోరీ ఇప్పటివరకు సెట్స్ పైకి రాలేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?