Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నాగార్జున మౌనం వెనక మెయిన్ రీజన్

నాగార్జున మౌనం వెనక మెయిన్ రీజన్

తన లైఫ్ లేదా కెరీర్ కు సంబంధించి ఏ చిన్న విషయం మీడియాలో వచ్చినా వెంటనే క్లారిటీ ఇవ్వడం నాగార్జునకు అలవాటు. మీడియా ఫ్రెండ్లీగా ఉండే నాగార్జున ఏ చిన్న విషయాన్ని దాచాలని ప్రయత్నించరు. వివరణ ఇవ్వాల్సిన సందర్భంలో ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. కెమెరా నుంచి తప్పించుకునే ప్రయత్నం అస్సలు చేయలేదు. అది సినిమా కావచ్చు, వ్యక్తిగత జీవితానికి సంబంధించినదైనా కావొచ్చు. నాగార్జున మాత్రం తన యాటిట్యూట్ ను ఎప్పుడూ వదులుకోలేదు. కానీ ఈసారి మాత్రం తన వైఖరికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు కింగ్. 

అఖిల్-శ్రియభూపాల్ ల పెళ్లి ఆగిపోయిందంటూ వార్తలు సునామీలా ఎగిసిపడుతున్నా నాగార్జున మాత్రం మౌనం వీడడం లేదు. వీళ్లిద్దరి పెళ్లికి సంబంధించి రోజుకో యాంగిల్ లో స్టోరీలు వస్తున్నప్పటికీ నాగ్ మాత్రం సైలెంట్ గానే ఉన్నారు. ఆ వార్తల్ని ధృవపరచడం లేదా ఖండించడం లాంటి ప్రయత్నాలేవీ చేయలేదు. దిల్ రాజు బ్యానర్ లో ఓ సినిమా చేస్తున్నారంటూ పుకార్లు వచ్చిన వెంటనే వాటిని ఖండించారు నాగ్. నాగచైతన్య-సమంత ప్రేమించుకుంటున్నారనే వార్తలకు.. ఓ మంచి సందర్భం చూసి క్లారిటీ ఇచ్చేశారు. ఇలా అన్ని విషయాల్లో క్లియర్ గా ఉండే నాగార్జున... అఖిల్-శ్రియ వ్యవహారంలో మాత్రం మౌనమునిలా మారిపోయారు.

నాగ్ ఇలా మారిపోవడానికి కారణం ఒకటే. ఈ మొత్తం వ్యవహారంలో పరిస్థితులు పాజిటివ్ గా మారతాయని నాగ్ ఆశిస్తున్నారు. తన చిన్నకొడుకు అఖిల్, శ్రియభూపాల్ మధ్య ఉన్న మనస్పర్థలు తొలిగిపోయి, వాళ్లు మళ్లీ కలిసిపోతారని నాగ్ గట్టిగా నమ్ముతున్నారట. తమ మధ్య ఉన్న అభిప్రాయభేదాల్ని తొలిగించుకుంటారని కలిసిపోవడానికి ఒక్క నిమిషం చాలని గట్టిగా నమ్మే నాగార్జున.. ఆ క్షణం కోసం ఎదురుచూస్తున్నారట. అందుకే ఇప్పటివరకు ఈ వ్యవహారం(వివాదం)పై నాగార్జున ఎలాంటి ప్రకటన చేయలేకపోతున్నారని అంటున్నారు అతని సన్నిహితులు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?