Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నటి రంభ నుంచి కోట్ల ఆభరణాలు కొట్టేశారా

నటి రంభ నుంచి కోట్ల ఆభరణాలు కొట్టేశారా

సినీ నటి రంభకు చెందిన నాలుగున్నర కోట్ల విలువైన ఆభరణాలను ఆమె బంధువులు కొట్టేశారా?ఇందులో ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో తెలియదు కాని, రంభ సోదరుడు ఈ మేరకు ఫిర్యాదు చేవారు. 

రంభ సోదరుడు వై.శ్రీనివాస్ కు , అతని భార్యతో తగాదా వచ్చింది. ఆమె వీరిపై వేధింపుల కేసు పెట్టారు. ఇప్పుడు శ్రీనివాస్ తన భార్య పల్లవి, ఆమె సోదరి శాంతిసింగ్‌చౌహాన్, జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ రవికిరణ్ (పల్లవి సోదరుడు), ఆయన భార్య వాణిజ్య పన్నుల శాఖాధికారిణి సంయుక్త తదితరులు కలిసి రంభకు చెందిన నాలుగున్నర కోట్ల విలువైన ఆభరణాలు కాజేయడమే కాకండా గతంలో తనపై, తన కుటుంబ సభ్యులపై అకారణంగా వరకట్న వేధింపుల కేసు పెట్టారని చెబుతున్నారు.

గతంలో తాము ఇక్కడ లేని సమయంలో బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో తమపై కేసు పెట్టారని, పల్లవి, శాంతిసింగ్ చౌహాన్, ఆమె సోదరుడు రవికిరణ్, సంయుక్తలపై చెన్నైలో తొలుత తామే ఫిర్యాదు చేశామని, కేసు నమోదైందని తెలిపారు. మొత్తం మీద రంభ బందువుల మద్య తగాదా అయితే వాస్తవం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?