Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నిర్మాతల నిర్ణయానికి బ్రేక్?

నిర్మాతల నిర్ణయానికి బ్రేక్?

కొన్ని న్యూస్ చానెళ్లకు మాత్రమే ప్రకటనలు ఇవ్వాలని, మరి కొన్నింటికి ఇవ్వకూడదంటూ కొంతమంది నిర్మాతలు కలిసి తీసుకున్న నిర్ణయం అమలుకు బ్రేక్ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి వివాదాస్పద నిర్ణయం తీసుకోవడం వల్ల అనవసరంగా తేనెతుట్టెను కదిపినట్లయింది. 

ఎవరికి ప్రకటనలు ఇవ్వాలి..ఎవరికి ఇవ్వకూడదు అన్నది నిర్మాత చూసుకుంటాడు. ఆయనకు శక్తి వుంటే అందరికీ ఇస్తాడు..లేకుంటే కొందరికి ఇస్తాడు. మధ్యలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో ఆంధ్ర జ్యోతి, ఎబిఎన్ కలిసి, చిత్రపరిశ్రమ వ్యవహారాలను తూర్పారపడుతూ, అన్నింటిని బట్టబయలు చేస్తోంది. 

అక్కడితో ఆగకుండా, హీరోలు, వాళ్ల నటన, ఫేస్ కట్ లు, ప్లాస్టిక్ సర్జరీలు, బిరుదులు, వాటి వైనాలు అన్నీ ఏకి వదుల్తోంది. నిర్మాతలు నిర్ణయం తీసుకోవడం, హీరోల బతుకులు బజార్న పడడం అన్నది ఇప్పుడు టాలీవుడ్ లో కొందర్ని చిర్రెత్తిస్తోంది. హీరోలు ఈ వ్యవహారం పట్ల కాస్త అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 

దాంతో చాలా మంది నిర్మాతలు ఆ నిర్ణయంతో తమకు సంబంధం లేదని అంటున్నారట. అంటే మొత్తానికి ఆ నలుగురో, పధ్నాలుగురో అనవసరంగా అభాసు అయ్యేటట్లు కనిపిస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?