Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నైజాం లో అడుగుపెడుతున్న యువి

నైజాం లో అడుగుపెడుతున్న యువి

నైజాం ఏరియా అంటే పెద్ద సినిమాలకు బంగారు బాతుగుడ్డు లాంటిది. కానీ ఇటీవల ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ లో ఇద్దరే కీలకమైన వ్యక్తులు మిగిలారు. దీంతో కాస్త మోనో పలీ వస్తోందని, కొనకుండా పంపిణీ మాత్రమే చేస్తామంటున్నారని, గుసగుసలు వినిపించాయి. ఎవరో ఒకరు దీన్ని బ్రేక్ చేయకుంటే కష్టమని కూడా కామెంట్లు వినిపించాయి. కానీ ఎవరు రావాలన్నా, ఎవరు కొన్నా, థియేటర్ల దగ్గరకు వచ్చేసరికి మళ్లీ ఇప్పుడు మోనోపలైజ్ చేస్తున్న వారి దగ్గరకే వెళ్లాల్సి వుంటుంది. అందుకే ఎవ్వరూ నైజాం మీద పెద్దగా దృష్టి పెట్టడం లేదు.

ఇప్పుడు రంగస్థలం సినిమాతో యువి సంస్థ నైజాంలో అడుగుపెడుతొంది. యువికి చెందిన విక్కీ (విక్రమ్) రంగస్థలం సినిమా నైజాం హక్కులు  18కోట్లకు తీసుకున్నారు.

విక్కీ హీరో రామ్ చరణ్ కు బాల్య స్నేహితుడు. అందుకే తన ఫ్రెండ్ సినిమాతో నైజాంలో అడుగుపెడుతున్నాడు. ఇప్పటికే యువి సంస్థ విశాఖ, గుంటూరు, నెల్లూరు, సీడెడ్ ప్రాంతాల్లో పంపిణీ రంగంలో చురుగ్గా వుంది. అలాగే థియేటర్ల విషయంలో కూడా యాక్టివ్ గా వుంది. 

కొన్ని చోట్ల స్వంతంగా, మరి కొన్ని చోట్ల దిల్ రాజు, గీతాలతో కలిసి సినిమాలు పంపిణీ చేస్తున్న యువి ఇప్పుడు నైజాంలోకి వచ్చింది. అంటే ఇక్కడ కూడా దిల్ రాజు, గీతా బ్యాకింగ్ వుండనే వుంటుంది. రంగస్థలం సినిమాతో మాంచి బోణీయే కొట్టేలా వుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?