Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఇకపై '​దాగుడు మూతలు​' లేవు

ఇకపై '​దాగుడు మూతలు​' లేవు

దిల్ రాజు బ్యానర్ లో హరీష్ శంకర్ దర్శకత్వంలో త్వరలోనే సెట్స్ పైకి రాబోతోంది దాగుడుమూతలు సినిమా. ఇందులో హీరోలుగా శర్వానంద్, నితిన్ నటించబోతున్నారు. ఒక హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ను అనుకుంటున్నారు. మరో హీరోయిన్ గా సాయి పల్లవిని తీసుకోవాలని ప్లాన్. సరిగ్గా ఇక్కడే నిర్మాత దిల్ రాజుకు ఎదురుదెబ్బ తగిలింది.

దాగుడు మూతలు ప్రాజెక్టులో నటించేందుకు సాయిపల్లవి ఒప్పుకోలేదు. తన క్యారెక్టర్ కు సినిమాలో పెద్దగా వెయిట్ లేకపోవడంతో ఈ స్టోరీని ఆమె రిజెక్ట్ చేసిందట. దిల్ రాజు తాజాగా నిర్మించిన ఎంసీఏ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్ గా నటించింది. అందులో ఆమె పాత్రకు పెద్దగా స్కోప్ ఇవ్వలేదు. తాజాగా హరీష్ శంకర్ వినిపించిన దాగుడు మూతలు కథలో కూడా తన పాత్రకు ఇంపార్టెన్స్ లేదని తప్పుకుందట సాయిపల్లవి.

మొన్నటికిమొన్న శ్రీనివాసకల్యాణం సినిమాలో నటించడానికి సాయిపల్లవి ఒప్పుకోలేదంటూ వార్తలు వచ్చాయి. ఇది కూడా దిల్ రాజు సినిమానే. కాకపోతే ఈ మేటర్ పై దిల్ రాజు క్లారిటీ ఇచ్చాడు. అసలు శ్రీనివాసకల్యాణం కథ సాయిపల్లవికి చెప్పలేదని, ఆమె చాలా మంచి పిల్లని క్లీన్ చిట్ ఇచ్చాడు. ఇప్పుడు దాగుడు మూతలు వ్యవహారంపై దిల్ రాజు ఏమంటాడో చూడాలి.

మరోవైపు దర్శకుడు హరీష్ శంకర్ మాత్రం తన ఫేవరెట్ హీరోయిన్ ను డైరక్ట్ చేసే ఛాన్స్ కోల్పోయాడు. ప్రేమమ్ మలయాళం వెర్షన్ చూసినప్పుడే సాయిపల్లవికి పెద్ద ఫ్యాన్ అయిపోయాడు హరీష్. ఫిదా షూటింగ్ టైమ్ లో ఆమెతో ఫొటోదిగి మరీ తన అభిమానాన్ని చాటుకున్నాడు. దాగుడు మూతలు సినిమాతో ఆమెను డైరక్ట్ చేద్దామనే ఆశలకు గండిపడింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?