Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఎన్టీఆర్ భయపడ్డాడా?

ఎన్టీఆర్ భయపడ్డాడా?

మైకు కనిపిస్తే ఆవేశం వస్తుంది కొందరికి. ఏదో ఒకటి మాట్లాడేస్తారు..తరువాత నాలుక కరుచుకుంటారు. అయితే సినిమా నటులు మాత్రం మైక్ ముందు జాగ్రత్తగా వుంటారు. పొడిపొడిగా నాలుగు ముక్కలు మాట్లాడతారు.. శతృవైనా.. మిత్రుడైనా సరే ఓ మంచి మాట పడేస్తారు. అయితే ఎన్టీఆర్ కు కాస్త ఎమోషన్ పాళ్లు ఎక్కువ. ఏదీ మనసులో దాచుకోలేరు. ఉన్నది ఉన్నట్లు కక్కేస్తారు. 

మొన్నటికి మొన్న మాటీవీ అవార్డు ఫంక్షన్ లో అదే జరిగింది. బెస్ట్ ఏక్టర్ అవార్డు అందుకున్న ఎన్టీఆర్ తన స్పీచ్ లో ముందుగా చిరంజీవి, నాగార్జున తదితరులు పేర్లు చెప్పారు. అప్పడు బాగానే వుంది. కానీ తరువాత సోషల్ మీడియాలో ఎన్టీఆర్ పై విమర్శలు మొదలయ్యాయి. ఎన్టీఆర్ ను, బాలయ్యను మరిచావా..అంటూ. వారిని వెనుక పెట్టావు అంటూ. 

కట్ చేస్తే..మా టీవీ అవార్డుల ఫంక్షన్ ఇప్పుడు ప్రసారమైంది. కానీ ఎన్టీఆర్ స్పీచ్ కాస్త ఆర్డర్ మారింది. ఎన్టీఆర్..ఎఎన్నార్..కృష్ణ, చిరంజీవి ఇలా మారింది. దీని వెనుక ఎన్టీఆర్ నే వున్నట్లు వినికిడి. తన స్పీచ్ అనంతరం ఎన్టీఆర్ అభిమానులు సోషల్ నెట్ వర్క్ లో చేసిన విమర్శలు తెలిసి, మాటీవీ యాజమాన్యానికి ఫోన్ చేసి, అవార్డుల ఉత్సవం ప్రసారం చేసినపుడు ఈ విధంగా మార్చమని కోరినట్లు వినికిడి. 

అయితే ట్విస్ట్ ఏమిటంటే..ఎన్టీఆర్ అప్పటి స్పీచ్..ఇప్పటి స్పీచ్ ను మళ్లీ పోస్టు చేస్తూ, విమర్శలు కొనసాగడం. అందుకే మాట్లాడేపుడు కాస్త కంట్రోల్ లో వుండాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?