Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఓవర్సీస్ కోసం ఎన్టీఆర్ 'ప్రత్యేక' ప్లాన్

ఓవర్సీస్ కోసం ఎన్టీఆర్ 'ప్రత్యేక' ప్లాన్

తెలుగు రాష్ట్రాల్లో జై లవకుశకు ఎంత ప్రచారం చేయాలో అంతా చేశాడు తారక్. దాదాపు 4రోజులు పూర్తిగా మీడియాలోనే నలిగాడు. మరి ఓవర్సీస్ సంగతేంటి? దీని కోసం కూడా ఓ ప్రత్యేకమైన ప్రచార ప్రణాళిక సిద్ధం చేశాడట ఎన్టీఆర్.

సినిమాకు వసూళ్లు రావాలంటే ఓవర్సీస్ ఇప్పుడు కీలకంగా మారింది. ఓవర్సీస్ లో హిట్ అయితేనే సినిమా సేఫ్ వెంచర్ అనిపించుకుంటోంది. ఈ నేపథ్యంలో జై లవకుశ సినిమా అమెరికాలో 189 లొకేషన్లలో విడుదలైంది. ప్రీమియర్స్ కోసమైతే ఓవర్సీస్ ప్రేక్షకులు పోటెత్తారు. కానీ రిలీజై ఓ 3వారాలు సినిమా ఆడాలంటే కచ్చితంగా అక్కడ కూడా ప్రచారం చేయాల్సిందే. 

ఎన్టీఆర్ యూఎస్ టూర్ వెనక మరో రీజన్ కూడా ఉంది. మరో 6రోజుల్లో స్పైడర్ రిలీజ్ అవుతోంది. ఎన్టీఆర్ సినిమాలతో పోలిస్తే మహేష్ సినిమాలకు ఓవర్సీస్ లో రీచ్ ఎక్కువ. సో.. పోటీ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇలాంటి టైమ్ లో జై లవకుశకు 'ఎక్స్ ట్రా' ప్రమోషన్ ఇవ్వడం తప్పనిసరి.

అందుకే అమెరికాలో పర్యటించాలనుకుంటున్నాడు తారక్. తన కుటుంబంతో పాటు ఈ టూర్ ప్లాన్ చేస్తున్నాడు. అమెరికాలోని కొన్ని ఎంపిక చేసిన లొకేషన్లలో సినిమాకు ప్రచారం కల్పించిన తర్వాత.. అట్నుంచి అటు ఫ్యామిలీతో కలిసి విహార యాత్రకు వెళ్తాడట ఎన్టీఆర్.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?