Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఒకే వేదికపై రజనీ-మహేష్?

ఒకే వేదికపై రజనీ-మహేష్?

2.0 (రోబో 2) సినిమా ముస్తాబయిపోతోంది. విడుదల ఇంక నెలల్లోకి వచ్చేసింది జనవరి మూడోవారంలో విడుదలకు రెడీ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల థియేటర్ రైట్స్ 81కోట్లకు ఆసియన్ సునీల్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇంత భారీగా తెలుగు హక్కులు అమ్మినందున, ఇక్కడ కూడా కాస్త భారీగానే ప్రచారం చేయాల్సి వుంది. అందుకే తెలుగులో కూడా ఓ భారీ అడియో ఫంక్షన్ లేదా ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయాలని రోబో 2 యూనిట్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

నవంబర్ 22న శిల్పకళా వేదికలో ఈ మేరకు ఫంక్షన్ చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఫంక్షన్ కు సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. దర్శకుడు శంకర్, సంగీత దర్శకుడు రెహమాన్ కూడా హాజరవుతారు. 

అయితే ఈ ఫంక్షన్ కు మరింత అట్రాక్షన్ తెచ్చేందుకు సూపర్ స్టార్ మహేష్ బాబును ప్రత్యేక అతిథిగా తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. శంకర్ అంటే మహేష్ కు మంచి గౌరవం వుంది. ఇటీవల చెన్నయ్ లో జరిగిన స్పైడర్ ఫంక్షన్ కు శంకర్ హాజరు కావాల్సిందే.

కానీ అదే రోజు శంకర్ భార్య కు వేరే సిటీలో డాక్టర్ అపాయింట్ మెంట్ వుండడంతో, ఆయన అటు వెళ్లిపోవాల్సి వచ్చింది. సో, శంకర్ సినిమా ఫంక్షన్ అంటే మహేష్ హాజరయితే ఆ ఇద్దరితో పాటు రజనీని మొత్తం ముగ్గురిని ఒకే వేదికపై చూసే అవకాశం వుంటుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?