Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సంక్రాంతి రేసులో మరో హీరో

సంక్రాంతి రేసులో మరో హీరో

ప్రస్తుతానికి ఈ 4సినిమాలు సంక్రాంతికి ఫిక్స్ అయ్యాయి. ఇప్పుడీ రేస్ లోకి మరో హీరో వస్తున్నాడు. అతడే రవితేజ. రాజా ది గ్రేట్ సక్సెస్ తో ఊపుమీదున్న ఈ హీరో.. తన నెక్ట్స్ మూవీ 'టచ్ చేసి చూడు'ను సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు రేపోమాపో అఫీషియల్ గా ఓ ప్రకటన రాబోతోంది. 

రచయిత విక్రమ్ సిరికొండను దర్సకుడిగా పరిచయం చేస్తూ టచ్ చేసి చూడు సినిమా చేస్తున్నాడు రవితేజ. రాశి ఖన్నా, సీరత్ కపూర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు ఓ కొలిక్కి వచ్చిందని చెబుతున్నారు. సో.. అన్నీ అనుకున్నట్టు జరిగితే సంక్రాంతి రిలీజ్ గ్యారెంటీ అట. 

నిజానికి టచ్ చేసి చూడు సినిమా రాజా ది గ్రేట్ కంటే ముందు రెడీ అవ్వాలి. కానీ సిరికొండ పనితీరు నచ్చక కొన్ని రోజుల పాటు రవితేజ ఈ సినిమాను పక్కనపెట్టేశాడు. అలా సైడ్ ట్రాక్ లోకి వెళ్లిన ఈ మూవీ ఎట్టకేలకు షూటింగ్ పూర్తిచేసుకుందట. 

ఇప్పటికే రేసులో నిలిచిన బాలకృష్ణ, పవన్ కల్యాణ్ కు పోటీగా రవితేజ కూడా బరిలో దిగితే ఈ సంక్రాంతి బాక్సాఫీస్ మరింత సందడిగా మారడం ఖాయం. కాకపోతే సంక్రాంతి టైమ్ కు వీటిలో ఎన్ని వస్తాయో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?