Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ప్రభాస్ అభిమానుల కలవరం

ప్రభాస్ అభిమానుల కలవరం

పంజా.. శక్తి.. అస్త్రం.. సాహో.. పంజా, శక్తి డిజాస్టర్ కదా? సినిమా ప్రారంభం కాకుండానే 150కోట్ల సాహోను తీసుకెళ్లి ఆ పక్కన పెట్టారేంటీ అని కారాలు మిరియాలు నూరేయక్కర్లేదు. ఇది ప్రభాస్ ఫ్యాన్స్ భయపడుతున్న విషయం గురించిన చిన్న వార్త మాత్రమే. సాహో సినిమా కోసం ఎక్కడెక్కడి నటులనో తెస్తున్నారు.

ముఖ్యంగా బాలీవుడ్ లో మార్కెట్ చేసుకోవడానికి వీలుగా అక్కడి నటులను తీసుకుంటున్నారు. ఆ క్రమంలో భాగంగా బాలీవుడ్ హీరో, తెలుగు సినిమాల పాలిట విలన్ అయిన జాకీ ష్రాఫ్ ను సాహోలో మెయిన్ విలన్ గా తీసుకుంటున్నారట.

అదే ఇప్పుడు ఫ్రభాస్ ఫ్యాన్స్ ను కలవర పెడుతోంది. తెలుగులో జాకీ ష్రాఫ్ ను తీసుకున్న ప్రతి సినిమా బాక్సాఫీస్ ధగ్గర పల్టీ కొట్టినవే. పంజా, శక్తి సినిమాలు ఎంతటి డిజాస్టర్లో జనాలకు తెలిసిందే. అలాంటి సెంటిమెంట్ బలంగా వుండగా, జాకీని పోయి పోయి, సాహోలోకి తీసుకోడం అన్నది సెంటి మెంట్ లును బలంగానమ్మే ఇండస్ట్రీ జనాల్లో కూడా డిస్కషన్ గా వుంది.

ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ సెంటి మెంట్ల చుట్టూ తిరుగుతుంది. అంతెందుకు తమిళ నటుడు శ్రీరామ్ ఇప్పటి దాకా తెలుగులో కనిపించిన ప్రతి సినిమా ఫ్లాపే. తాజగా వచ్చిన లై తో సహా. ఒకప్పటి హీరో సురేష్ సెకెండ్ ఇన్నింగ్స్ లో కనిపించిన ప్రతి సినిమా (జనతాగ్యారేజ్ మినహా) ప్రతి సినిమా ఫ్లాపే. తాజాగా వచ్చిన లై తో సహా. అందుకే జాకీ ష్రాఫ్ తెలుగులో సాహోతో మళ్లీ అడుగుపెడుతున్నాడని తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ కలవరపడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?