Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ప్రభాస్ గ్రేట్

ప్రభాస్ గ్రేట్

తెలుగు మీడియాను బాహుబలి యూనిట్ చిన్న చూపు చూస్తోందని, పెద్దగా పట్టించుకోవడం లేదని అంతర్గతంగా అసంతృప్తి వున్న వ్యవహారం హీరో ప్రభాస్ దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. అందుకే తన సినిమా సాహో విషయంలో ఇలాంటి అసంతృప్తి వుండకుండా ముందు జాగ్రత్త తీసుకోమని ఆయన తన నిర్మాతను కోరినట్లు తెలుస్తోంది.

సాహో టీజర్ విడుదల గురించి తెలుగు మీడియాకు పేరు పేరునా తెలియ చేయమని, అలాగే టీజర్ ను ప్రతి మీడియాకు నేరుగా పంపించమని ఆయన యూనిట్ జనాలకు చెప్పినట్లు తెలుస్తోంది. వీలయితే, టైమ్ వుంటే టీజర్ ప్రదర్శనను మీడియాకు వేరుగా ఏర్పాటుచేసే ప్రయత్నం చేయమని ప్రభాస్ చెప్పినట్లు వినికిడి.

సాహో సినిమాను ప్రభాస్ మితృులు, సోదరుడు కలిసి నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను వంద కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రన్ రాజా రన్ దర్శకుడు సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?