Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ప్రాజెక్టులపై నాగ్ మీమాంస

ప్రాజెక్టులపై నాగ్ మీమాంస

ఓం నమో వేంకటేశాయ తరువాత రాజుగారి గది 2 సినిమా ఓకే చేసాడు నాగార్జున. మరి ఆ తరువాత ఏంటీ అన్నదానిపై ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు. చందు మొండేటి డైరక్షన్ లో సినిమా వుండే అవకాశం చాలా వరకు వుంది. అయితే ఈ సినిమాలో మరో యంగ్ క్యారెక్టర్ వుండడంతో దానికి నిఖిల్ ను సజెస్ట్ చేసాడు చందు. దానికి నాగ్ కూడా దాదాపు ఓకె అన్నాడు. అయితే ఈ కథ ఫినిష్ చేసే విషయంలో ఇంకా కొంతటైమ్ పట్టేటట్టు కనిపిస్తోంది. నాగ్ ఇంతవరకు ఫస్ట్ హాఫ్ మాత్రమే విన్నట్లు వినికిడి.

ఇదిలా వుంటే శతమానం భవతి డైరక్టర్ సతీష్ వేగ్నిశ డైరక్షన్ లో నాగ్ తో సినిమా చేయాలని దిల్ రాజు ఆశపడుతున్నాడు. కానీ నాగ్ అంతగా మొగ్గు చూపడం లేదు.శతమానం భవతి హిట్ కావడం వాస్తవమే కానీ, సినిమాలో సరైన ఆసక్తికరమైన ఎలిమెంట్స్ కానీ, హీరో పాత్రకు సరైన జోష్ కానీ లేదన్నది ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల అభిప్రాయం. పైగా గతంలో ఇదే డైరక్టర్ కు రెండు చేదు అనుభవాలు వున్నాయి. 

ఈ ప్రాజెక్టును దిల్ రాజే దాదాపు హ్యాండిల్ చేసాడన్నది ఆ సినిమా యూనిట్ వర్గాల బోగట్టా. అందువల్ల అలాంటి డైరక్టర్ ను నమ్మి నాగ్ ముందుకు ఎలా వస్తాడు? అందుకే దిల్ రాజు ఆశపడడమే కానీ, ఆ ప్రాజెక్టు పట్టాలెక్కే అవకాశాలు తక్కువే.

ఇంకోపక్క ఆ మధ్య నానితో మజ్ఞు చేసిన విరించివర్మ, మరో డైరక్టర్ కిషోర్ తిరుమల కూడా ఓ మాంచి పాయింట్ నాగ్ కు చెప్పినట్లు తెలుస్తోంది. ఇదిలా వుంటే రాజుగారి గది తరువాత నాగ్ కాస్త గ్యాప్ తీసుకుంటాడని కూడా వినిపిస్తోంది. అఖిల్ పెళ్లి, చైతూ నిశ్చితార్థం వంటి వ్యవహారాలు వుండడమే ఇందుకు కారణం కావచ్చు. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?