Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రంగస్థలం రీషూట్లే రీషూట్లు

రంగస్థలం రీషూట్లే రీషూట్లు

రంగస్థలం చిత్రం షూటింగ్‌ ముగించి గుమ్మడికాయ కూడా కొట్టేసారనే సంగతి వినే వుంటారు. షూటింగ్‌ అయిపోయింది కదా అన్నట్టు చరణ్‌ కూడా గడ్డం కాస్త ట్రిమ్‌ చేసాడు. అయితే డైరెక్టర్‌ సుకుమార్‌ కొన్ని సీన్ల పరంగా సంతృప్తి పడలేదట. మొత్తంగా కోనసీమలో షూటింగ్‌ చేద్దామని ప్లాన్‌ చేసిన ఈ చిత్రం అక్కడ చేయడం కుదర్లేదు.

షూటింగ్‌కి అంతరాయాలు ఎక్కువ వస్తున్నాయని, కోనసీమని తలపించే సెట్‌ హైదరాబాద్‌ స్టూడియోలో వేసేసి షూటింగ్‌ కానిచ్చేసారు. అయితే సహజ లొకేషన్లలో తీస్తే వచ్చే ఎఫెక్ట్‌ మిస్‌ అయిందని సుకుమార్‌ కంప్లయింట్‌ చేయడంతో మరోసారి ఆ సీన్లు షూట్‌ చేయడానికి రాజమండ్రి వెళ్లారు.

రంగస్థలం చిత్రాన్ని ముందుగా సంక్రాంతికే విడుదల చేద్దామని అనుకున్నారు కానీ అజ్ఞాతవాసి అనౌన్స్‌ చేయడంతో మార్చికి వాయిదా వేసారు.

పర్‌ఫెక్షనిస్టుగా పేరున్న సుకుమార్‌కి ఇప్పుడు తన ప్రాజెక్ట్‌కి మళ్లీ మెరుగులు దిద్దుకునే టైమ్‌ దొరకడంతో మరోసారి షూటింగ్‌ మొదలు పెట్టాడు. బోయపాటి శ్రీను సినిమా షూటింగ్‌కి రెడీ కావాల్సిన చరణ్‌ ఇప్పుడు రంగస్థలం కోసం ఎక్స్‌ట్రా డేట్స్‌ ఇచ్చాడు. మళ్లీ గుబురు గడ్డం పెంచేసి బోయపాటి సినిమా షూటింగ్‌ని కొన్ని రోజులు వాయిదా వేసాడు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?