Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

రంగస్థలం లేట్: కారణం దేవిశ్రీ ప్రసాద్

రంగస్థలం లేట్: కారణం దేవిశ్రీ ప్రసాద్

లెక్కప్రకారం ఈపాటికి రంగస్థలం ఫైనల్ షెడ్యూల్ కంప్లీట్ అవ్వాలి. ఈరోజు నుంచి బోయపాటి సినిమా సెట్స్ పైకి చరణ్ వచ్చేయాలి. కానీ రంగస్థలం ఇంకాస్త ఆలస్యమైంది. ఈసారి మాత్రం ఆలస్యానికి కారణం దర్శకుడు సుకుమార్ కాదు, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్.

రంగస్థలం సినిమాకు సంబంధించి 2పాటలు పెండింగ్ ఉన్నాయి. వీటిలో ఒకటి ఐటెంసాంగ్. దేవిశ్రీ-సుకుమార్ కాంబినేషన్ లో ఐటెంసాంగ్ అంటే అది పక్కా హిట్. ఇంతకుముందు వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన స్పెషల్ సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. కానీ ఆ స్టాండర్డ్స్ లో రంగస్థలం ఐటెంసాంగ్ లేదని తెలుస్తోంది.

అందుకే దేవిశ్రీప్రసాద్ తో మరిన్ని సిట్టింగ్స్ లో పాల్గొంటున్నాడట సుకుమార్. ఐటెంసాంగ్ పక్కాగా వచ్చిన తర్వాతే షూటింగ్ పెట్టుకోవాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే రంగస్థలం షెడ్యూల్ కాస్త ఆలస్యంగా నడుస్తున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం చరణ్-సమంతపై ఓ డ్యూయట్ పిక్చరైజ్ చేస్తున్నారు. ఇది కంప్లీట్ అయ్యేలోపు ఐటెంసాంగ్ కంపోజిషన్ పూర్తిచేస్తారు. ఈ ఐటెంసాంగ్ లో పూజా హెగ్డే స్పెషల్ ఎట్రాక్షన్. ఐటెంసాంగ్ షూటింగ్ తో రంగస్థలం టోటల్ షూటింగ్ కంప్లీట్ అవుతుంది. ఈనెల 26న రంగస్థలం టీజర్ ను విడుదల చేయబోతున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?