Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

స్పైడర్ పైకి మహానుభావుడు

స్పైడర్ పైకి మహానుభావుడు

దసరా బరిలోకి మహానుభావుడు శర్వానంద్ దిగుతున్నాడు. జై లవకుశ, స్పైడర్, పైసా వసూల్ ఇలా మూడు సినిమాలు దసరా బరిలోకి వస్తాయని మొదట్నించీ అనుకున్నారు. కానీ పైసా వసూల్ ఏకంగా మూడు వారాలు ముందుకు వచ్చేసింది. జై లవకుశ వస్తుంది అని యూనిట్ ఘంటా పథంగా చెబుతోంది కానీ, వర్క్ ఫినిష్ అవుతుందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఇండస్ట్రీలో. అయినా దసరాకి వారం రోజులు ముందు జై లవకుశ. అంటే దసరా టైమ్ లో స్పైడర్ ఒక్కటే అన్నమాట.

మరి అలా స్పైడర్ కు అలా సోలోగా గ్రౌండ్ వదిలేయడం ఎందుకు అనుకున్నారో? లేక మరేం ఉప్పు అందిందో కానీ, యువి క్రియేషన్స్ సంస్థ తను నిర్మిస్తున్న మీడియం రేంజ్ సినిమా మహానుభావుడును దసరా బరిలోకి దింపాలనుకుంటోందట. శర్వానంద్ తో మారుతి డైరక్షన్ లో స్టార్ట్ చేసిన ఈ సినిమా ఒక్క పాట మినహా మిగిలిన వర్క్ అంతా పూర్తయిపోయింది. ఈ పాట కూడా త్వరలో లోకల్ గానే పిక్చరైజ్ చేసేస్తారు.

అందువల్ల సెప్టెంబర్ 28లేదా 29న విడుదల చేయాలని యువి క్రియేషన్స్ ప్లాన్ చేస్తోందట. పైగా అదే టైమ్ లో జవాన్ విడుదల అనుకున్నారు కానీ, అది లేదని తెలుస్తోంది. అందువల్ల దసరా సీజన్ ను మిస్ చేసుకోకూడదని మహానుభావుడు టీమ్ డిసైడ్ అయింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?