Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

శ్రీదేవి, బోనీ కపూర్ ల మధ్య విబేధాలు?

శ్రీదేవి, బోనీ కపూర్ ల మధ్య విబేధాలు?

దశాబ్దాలుగా తమ వైవాహిక జీవితాన్ని విజయవంతంగా సాగిస్తున్న నటి శ్రీదేవి, నిర్మాత బోనీ కపూర్ ల మధ్య విబేధాలు పొడసూపినట్టుగా వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ ఒక విషయమై గొడవ పడుతున్నట్టుగా బాలీవుడ్ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. మరి ఇన్నాళ్లూ హ్యాపీగా గడిపేసిన వీళ్లు గొడవ పడటం  ఏమిటి, కారణం ఏమిటి అని ఆరా తీస్తే .. ఇదంతా కూతురు జాన్వీ విషయంలో అనే సమాచారం అందుతోంది.

జాన్వీ మూవీ ఎంట్రీ గురించి ఆ భార్యభర్తలిద్దరూ గొడవ పడుతున్నారని సమాచారం. శ్రీదేవి పెద్ద కూతురు సినిమా ఎంట్రీ గురించి చాన్నాళ్లుగానే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో శ్రీదేవి చాలానే కసరత్తు చేసింది. కూతురికి నటనకు సంబంధించి, డాన్సుకు సంబంధించి శిక్షణ ఇప్పించింది. తనకు తగిన వారసురాలిగా చేసేందుకు తీవ్రంగానే శ్రమించింది.

ఇంత అయ్యాకా  తన కూతురిని మంచి ప్రొడ్యూసర్ చేతిలో పెట్టాలని శ్రీదేవి భావించింది. జాన్వీని ఇంట్రడ్యూస్ చేయడానికి చాలా మంది ఉత్సాహంగానే ఉన్నా, శ్రీదేవి మాత్రం కూతురిని ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జొహార్ చేతిలో పెట్టాలని భావించిందట. జాన్వీ ఇంట్రడక్షన్ కు కరణే కరెక్ట్ అని శ్రీదేవి భావించింది. అయితే బోనీ కపూర్ మాత్రం దానికి సమ్మతించలేదని సమాచారం.

తన కూతురి తొలి సినిమాకు తనే నిర్మాతగా వ్యవహరిస్తానని బోనీ అంటున్నాడట. బోనీ ప్రముఖ నిర్మాత అని వేరే చెప్పనక్కర్లేదు. తన కూతురు తొలి సినిమాకు తనే నిర్మాతగా వ్యవహరిస్తే అటు క్యాష్ చేసుకోవడానికి అనుకూలంగా ఉండటంతో పాటు, జాన్వీకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని బోనీ భావిస్తున్నాడట అయితే శ్రీదేవి మాత్రం కూతురు తొలి సినిమా కరణ్ తోనే కావాలని గట్టిగా ఉందట.. ఈ విధంగా బోనీ, శ్రీదేవిల మధ్య విబేధాలు చెలరేగాయని బాలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు. మరి ఈ భార్యభర్తల్లో పై చేయి ఎవరిది అవతుందో.. కూతురి విషయంలో ఎవరిది పై చేయి అవుతుందో!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?