Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సస్పెన్స్‌తో చంపేస్తోన్న జక్కన్న

సస్పెన్స్‌తో చంపేస్తోన్న జక్కన్న

బాహుబలి తర్వాత ఎవరితో సినిమా చేస్తాననేది రాజమౌళి ప్రకటించలేదు కానీ అందరు హీరోలకీ ఆసక్తి కలిగించే ఒక స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు.

ఈసారి చేసే సినిమా గ్రాఫిక్స్‌తో కూడినది కాదని, రెగ్యులర్‌ సినిమానే చేస్తానని రాజమౌళి చెప్పాడు. అంటే రాజమౌళి తీసే ఆ సినిమా ఏడాదిలోగా విడుదలైపోతుందన్నమాట.

రాజమౌళి చిత్రం చేయాలంటే మూడు, నాలుగేళ్లు కేటాయించాలనే భయం లేకపోయేసరికి అతనితో ఈ చిత్రం చేయాలని టాప్‌ హీరోలందరూ ఆశ పడుతున్నారు.

రాజమౌళితో సినిమా అంటే ఉన్నపళంగా మార్కెట్‌ మూడింతలయ్యే అవకాశం వుండడంతో ఈ ఛాన్స్‌ తమదే కావాలని చాలా మంది ఎదురు చూస్తున్నారు.

అయితే రాజమౌళి మాత్రం తన తదుపరి చిత్రం ఎవరితో అనేది తేల్చడం లేదు. అసలు తెలుగులోనే తీస్తాడా లేక బాలీవుడ్‌ హీరోతో చేస్తాడా అనేది సస్పెన్స్‌గానే వుంది.

కథ రెడీ అయ్యాక గానీ హీరోని డిసైడ్‌ అవనని అంటోన్న జక్కన్న అసలు ఈసారి ఎలాంటి సినిమాతో వస్తాడనేది సినీ ప్రియుల్లోను ఉత్కంఠ రేకెత్తిస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?