Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

తేజుకి డిస్సపాయింట్ మెంట్

తేజుకి డిస్సపాయింట్ మెంట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాధారణంగా ఫంక్షన్లకు రారు. కానీ వస్తే ఆ కిక్కే వేరుగా వుంటుంది. హీరో సాయి ధరమ్ తేజ అంటే పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక అభిమానం. అందుకే సాయి ధరమ్ తేజ లేటెస్ట్ మూవీ విన్నర్ ఫ్రీ రిలీజ్ ఫంక్షన్ కు పవన్ వస్తారని అందరూ భావించారు. సాయి ధరమ్ కూడా అలాగే అనుకున్నారు. 

పవన్ నే కాదు, పెదమామయ్య మెగాస్టార్ చిరంజీవి కూడా వస్తారని.అయితే ఇటు చిరంజీవి మీలో ఎవరు కోటీశ్వరుడు ఎపిసోడ్ షూటింగ్ లో బిజీగా వున్నారు. దాంతో ఆయన ముందే చెప్పేసినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ అమెరికా నుంచి వచ్చారు. మళ్లీ కాటమరాయుడు సాంగ్స్ కోసం విదేశాలు వెళ్లే పనిలో వున్నారు.

అంతకు మించి మంగళగిరి చేనేత సదస్సు ఏర్పాట్లలో ఫుల్ బిజీగా వున్నారు. అయినా ట్రయ్ చేస్తా అని సాయి కి మాటిచ్చినట్లు తెలుస్తోంది. అందువల్ల ఆఖరి నిమిషం వరకు పవన్ మామయ్య వస్తారనే ఆశ పడ్డాడు తేజు. కానీ పవన్ కు కుదరలేదు..రాలేదు. అందుకే ఫంక్షన్ బాగా జరిగినా సాయి ధరమ్ తేజకు చిన్న డిస్సపాయింట్ మెంట్ మిగిలిపోయింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?