Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ట్రయిలర్ లోనే సినిమా చూపించేసారు

యామిరుక్కు భయమే సినిమా వచ్చి చాలా ఏళ్లు అయిపోతోంది. ఇన్నాళ్లకు తెలుగులో ‘ఈటీవీ ప్రభాకర్’ డైరక్షన్ లో వస్తోంది. నెక్ట్స్ నువ్వే అనేది టైటిల్. ఆది హీరోగా నటించిన ఈ సినిమా ట్రయిలర్ బయటకు వచ్చింది. సినిమా విడుదల ఇంకా నెలన్నర వుండగానే ట్రయిలర్ బయటకు వదలడం విశేషం.

అల్లు అరవింద్ మళ్లీ అవుటాఫ్ టౌన్ లో వుంటారని, ఆయన వున్నపుడే ట్రయిలర్ లాంచ్ చేయాలని చేసేసారు. రెండు నిమషాలకు పైనే వున్న ట్రయిలర్ లో మొత్తం కథనంతా చెప్పేసినట్లే. ఓ అప్పుల తిప్పడు, ఏక సినిమా వీరుడు కలిసి హోటల్ పెట్టడం, అందులో జనాలు చావడం, శవాలు దాచడం, పోలీసులు, కథా కమామిషు.

ఇలా సినిమా అంతా ట్రయిలర్ లోనే ఆరేసేసారు. ఇక మిగిలింది చివరి చిన్న సస్పెన్స్ మాత్రమే అనుకోవాలి. హీరోగా ఆది ట్రయిలర్ లో కలిగించిన ఇంపాక్ట్ ఏమీ లేదు. పైగా బాబు బాగా బిజీ, గుంటూరుటాకీస్ టైపు గ్రాఫిక్స్ ట్రయిలర్ కు జోడించి, దాని స్థాయి పడేసారు. పైగా రేష్మీ ‘గడ్డి వాము’  డైలాగు ఒకటి. చక్కగా హర్రర్ కామెడీ జోనర్ ను పద్దతిగా ప్రెజెంట్ చేస్తూ ట్రయిలర్ కట్ చేయకుండా, ఇదంతా ఏమిటో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?