Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

'ఉంగరాలు' కొనేవారు లేరా?

'ఉంగరాలు' కొనేవారు లేరా?

సరైన కాంబినేషన్ లేకపోతే సినిమా కాణీకి చెల్లదు. సునీల్-క్రాంతిమాధవ్ కాంబినేషన్ లోని ఉంగరాల రాంబాబు సినిమా పరిస్థితి అదే. నిజానికి క్రాంతి మాధవ్ 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' అనే మంచి సినిమా తీసారు. కానీ కమర్షియల్ గా సూపర్ గా ఏమీ వర్కవుట్ కాలేదు. సునీల్ కు జక్కన్న హిట్ వున్నా, వీడు గోల్డ్ ఎహె దెబ్బ తీసింది. ఈ కాంబినేషన్ లో సినిమా చేసారు పరుచూరి ప్రసాద్.

సినిమా పూర్తయింది. బాగా వచ్చిందన్నది ఇన్ సైడ్ టాక్. పాటలు, పిక్చరైజేషన్ బాగుంది అన్నది వినిపిస్తున్న వార్త. కానీ సినిమాను మాత్రం ఎవరూ కొనడానికి రావడం లేదు. సినిమా అమ్మితే తప్ప విడుదల చేయను అని నిర్మాత పరుచూరి ప్రసాద్ భీష్మించుకు కూర్చున్నట్లు తెలుస్తోంది. దీంతో సమ్మర్ సీజన్ క్లోజ్ అయిపోతోంది కానీ, సినిమా మాత్రం విడుదల చేసే సూచనలు కనిపించడం లేదు.

ఈ సినిమా విడుదలై హిట్ టాక్ వస్తే, మళ్లీ మరో సినిమా వస్తుందన్న ఆశ వుంది దర్శకుడు క్రాంతి మాధవ్ కు. తన ప్రయత్నం తను చేసానని, ఇక తన చేతుల్లో ఏమీ లేదని అంటున్నాడట తనను కలిసిన వారితో. ఈ సినిమా బాగా వచ్చిందని, మళ్లీ తనకు ప్లస్ అవుతందని అంటున్నాడట సునీల్. అంతా బాగానే వుంది కానీ ఆ విడుదల అన్నదే కనిపించడం లేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?