Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

వార్త ‘మధుర’మే..కానీ సాధ్యమేనా?

వార్త ‘మధుర’మే..కానీ సాధ్యమేనా?

టాలీవుడ్ లో వార్తలు రెండు రకాలు..ఒకటి పుట్టేవి..రెండు పుట్టించేవి. ఇటీవల ఓ వార్త టక్కున పుట్టింది. రాజ్ తరుణ్ హీరోగా, సీనియర్ డైరక్టర్ వంశీ, లేడీస్ టైలర్ పార్ట్ 2 అనే ఫ్యాషన్ డిజైనర్ సినిమా చేస్తారని. దానికి మధుర శ్రీధర్ నిర్మాత అని.

కానీ ఈ వార్తలోకి తొంగి చూస్తే, అంతా కూడా ఆలు లేదు, చూలు లేదు అల్లుడు పేరు సోమలింగం టైపు వార్త అని తేలిపోయింది. ఈ విషయమే హీరో రాజ్ తరుణ్ కు తెలియదట. ఇప్పటికే హ్యాండ్ ఫుల్ అసైన్ మెంట్లతో బిజీగా వున్నాడు కుర్రాడు. పైగా ఇటీవలే గీతా ఆర్ట్స్ లో అగ్రిమెంట్ చేసుకుని అడ్వాన్స్ అందుకున్నాడు. 

అసలు జరిగిందేమిటా అని ఆరా తీస్తే..సీనియర్ వంశీ కొన్నాళ్ల క్రితం రాజ్ తరుణ్ కు ఓ లైన్ చెప్పారని వినికిడి. ఒక హీరో ఎనిమిది మంది హీరోయిన్ల లైన్. అది అక్కడే ఆగింది. కథ మొత్తం వుంటే విని చేద్దామని హీరో అన్నాడని వినికిడి. ఇంతలో వున్నట్లుండి మధుర శ్రీధర్ లైన్ లోకి వచ్చారు. ఫ్యాషన్ డిజైనర్ సినిమా చేద్దామని, అవసరం అయితే దాని హక్కులు తీసుకుంటానని. ఆ హక్కుల అమ్మిరాజు దగ్గర వున్నాయి. ఆయన, తనికెళ్ల కలిసి రవితేజతో చేయాలనుకున్నారు. 

ఈ హక్కులు తీసుకున్నారో లేదో తెలియదు, రాజ్ తరుణ్ కు లైన్ కూడా చెప్పలేదు. కానీ మీడియాకు లీకులు మాత్రం ఇచ్చేసారు. ఈ వార్తలు విని రాజ్ తరుణ్ తెల్లబోయాడట..తనకు లైన్ చెప్పలేదు. డేట్లు తీసుకోలేదు..అని. పైగా మధుర శ్రీధర్ చేతిలో ఇంకా మొదలుకానీ,  పూర్తి చేయాల్సిన ఓం మంగళం..మంగళం..మంగళం.. వుంది. దానికే కాస్త ఫండింగ్ చూసుకోవాలి. తరువాత ఈ సినిమా హక్కులు, నిర్మాణం..ఇందంతా జరిగే వ్యవహారమేనా అన్నది అనుమానం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?